యాప్నగరం

ఓటు వేస్తే నరికేస్తాం

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా ఓట్లు వేస్తే నరికేస్తామని హెచ్చరిస్తోంది ఉగ్రవాద సంస్థ ఐసీస్. ముస్లింలు ఓటు వేయడానికి వెళ్లొద్దంటూ కోరింది.

TNN 6 Nov 2016, 7:37 pm
త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా ఓట్లు వేస్తే నరికేస్తామని హెచ్చరిస్తోంది ఉగ్రవాద సంస్థ ఐసీస్. ముస్లింలు ఓటు వేయడానికి వెళ్లొద్దంటూ కోరింది. ఐఎస్ఐఎస్‌కు చెందిన అల్ హయత్ మీడియా ఈ హెచ్చరిక చేసింది. ఇస్లాం మతం, ముస్లింలకు వ్యతిరేకమైన విధానాల విషయంలో రిపబ్లికన్ పార్టీకీ, డెమొక్రటిక్ పార్టీకి మధ్య తేడా ఏమీ లేదని ప్రకటించింది. దీంతో టెక్సాస్, వర్జీనియాలో అమెరికా ప్రభుత్వం నిఘా ముమ్మరం చేసింది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.