North Korea ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) మరోసారి తన చర్యలతో ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నారు. బుధవారం 23 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను (Ballistic Missiles) వివిధ ప్రాంతాల మీదుగా ప్రయోగించి అమెరికా, దక్షిణ కొరియాలకు (South Korea) హెచ్చరికలు పంపిన ఉత్తర కొరియా.. గురువారం సైతం మరో మూడు క్షిపణులను ప్రయోగించింది. ఒక దీర్ఘశ్రేణి, రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. సోమవారం నుంచి ప్రారంభమైన అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త వైమానిక విన్యాసాలను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన మర్నాడే ఉత్తర కొరియా రెచ్చిపోయింది. బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం, యెల్లో సముద్రంలోకి ప్రయోగించగా.. వీటిలో ఒకటి దక్షిణ కొరియా ప్రాదేశిక సముద్ర జలాల్లో కూలింది. 1945లో కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయిన తర్వాత దక్షిణ కొరియా ప్రాదేశిక సముద్ర జలాల్లో ఓ క్షిపణి పడటం ఇదే తొలిసారి. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకుని.. గగనతలదాడులకు సంబంధించిన ముందస్తు హెచ్చరిక సైరన్లు దక్షిణ కొరియాలో మోగాయి. ఉల్లాంగ్దో ద్వీపానికి 167 కిలోమీటర్ల దూరంలో ల్యాండైన ఓ క్షిపణి.. అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బాంబు షెల్టర్లలోకి స్థానికులను తరలిస్తున్న ఫోటోలు, వీడియోలు జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి.
ఉభయ కొరియాలో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి 2018లో సృష్టించిన తూర్పు సముద్రం బఫర్ జోన్లోకి ఉత్తర కొరియా 100 ఫిరంగి గుళ్లను పేల్చగా.. ఈ దాడులకు దక్షిణకొరియా దీటుగా స్పందించింది. ఫైటర్ జెట్ విమానాల నుంచి మూడు క్షిపణులను ప్రయోగించింది. గురువారం ఉదయం 7.40 గంటలకు ప్యాంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం తూర్పు సముద్రం నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్టు సియోల్ ధ్రువీకరించింది. దీనిని గుర్తించిన కొద్ది సేపటికే ఉదయం 8.39 గంటలకు దక్షిణ ప్యాంగన్ ప్రావిన్సుల్లోని కైచన్ నుంచి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది.
తాజా ఘటనలతో అమెరికా సహకారంతో పూర్తిస్థాయిలో సంసిద్ధతను దక్షిణ కొరియా సైన్యం కొనసాగిస్తోంది. గురువారం నాటి క్షిపణి ప్రయోగాలను జపాన్ సైతం ధ్రువీకరించింది. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను జపాన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. క్షిపణి తమ భూభాగం మీదుగా ప్రయాణించిందని, జే-అలర్ట్ జారీచేశామని జపాన్ పేర్కొంది. అయితే, కొద్ది సేపటికే తమ భూభాగంలోకి క్షిపణి రాలేదని, తమ ప్రాదేశిక జలాలో సమీపంలో గుర్తించామని జపాన్ రక్షణ మంత్రి ప్రకటించారు.
‘విజిలెంట్ స్టార్మ్’ (Vigilant Mart)పేరుతో అమెరికా, దక్షిణ కొరియాలు భారీస్థాయిలో వైమానిక విన్యాసాలను చేపట్టాయి. సోమవారం ప్రారంభమైన ఈ విన్యాసాల్లో 240కి పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఇరు దేశాల సంయుక్త విన్యాసాల చరిత్రలో ఇది అతి పెద్దది. అందుకే ఆగ్రహంతో రగిలిపోయిన ఉత్తర కొరియా.. వైమానిక విన్యాసాలు ఆపకపోతే శక్తిమంతమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం హెచ్చరించింది.
2017 తర్వాత మళ్లీ ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయి అణ్వస్త్ర పరీక్ష జరపకపోయినా, స్వల్పస్థాయిలో దక్షిణకొరియాపై దాడి జరిపే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కిమ్ జోంగ్ ఉన్.. పదే పదే తన సైన్యంతో క్షిపణులను పరీక్షిస్తున్నారని అంటున్నారు.
ఉభయ కొరియాలో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి 2018లో సృష్టించిన తూర్పు సముద్రం బఫర్ జోన్లోకి ఉత్తర కొరియా 100 ఫిరంగి గుళ్లను పేల్చగా.. ఈ దాడులకు దక్షిణకొరియా దీటుగా స్పందించింది. ఫైటర్ జెట్ విమానాల నుంచి మూడు క్షిపణులను ప్రయోగించింది. గురువారం ఉదయం 7.40 గంటలకు ప్యాంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం తూర్పు సముద్రం నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్టు సియోల్ ధ్రువీకరించింది. దీనిని గుర్తించిన కొద్ది సేపటికే ఉదయం 8.39 గంటలకు దక్షిణ ప్యాంగన్ ప్రావిన్సుల్లోని కైచన్ నుంచి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది.
తాజా ఘటనలతో అమెరికా సహకారంతో పూర్తిస్థాయిలో సంసిద్ధతను దక్షిణ కొరియా సైన్యం కొనసాగిస్తోంది. గురువారం నాటి క్షిపణి ప్రయోగాలను జపాన్ సైతం ధ్రువీకరించింది. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను జపాన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. క్షిపణి తమ భూభాగం మీదుగా ప్రయాణించిందని, జే-అలర్ట్ జారీచేశామని జపాన్ పేర్కొంది. అయితే, కొద్ది సేపటికే తమ భూభాగంలోకి క్షిపణి రాలేదని, తమ ప్రాదేశిక జలాలో సమీపంలో గుర్తించామని జపాన్ రక్షణ మంత్రి ప్రకటించారు.
‘విజిలెంట్ స్టార్మ్’ (Vigilant Mart)పేరుతో అమెరికా, దక్షిణ కొరియాలు భారీస్థాయిలో వైమానిక విన్యాసాలను చేపట్టాయి. సోమవారం ప్రారంభమైన ఈ విన్యాసాల్లో 240కి పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఇరు దేశాల సంయుక్త విన్యాసాల చరిత్రలో ఇది అతి పెద్దది. అందుకే ఆగ్రహంతో రగిలిపోయిన ఉత్తర కొరియా.. వైమానిక విన్యాసాలు ఆపకపోతే శక్తిమంతమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం హెచ్చరించింది.
2017 తర్వాత మళ్లీ ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయి అణ్వస్త్ర పరీక్ష జరపకపోయినా, స్వల్పస్థాయిలో దక్షిణకొరియాపై దాడి జరిపే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కిమ్ జోంగ్ ఉన్.. పదే పదే తన సైన్యంతో క్షిపణులను పరీక్షిస్తున్నారని అంటున్నారు.