యాప్నగరం

నవ్ రోజ్ వేడుకల్లో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతి

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుధవారం (మార్చి 21) పర్షియన్ కొత్త సంవత్సరం ‘నవ్ రోజ్’ వేడుకల్లో ఉన్న ప్రజలపై పంజా విసరడంతో 26 మంది మరణించారు.

TNN 21 Mar 2018, 3:32 pm
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. బుధవారం (మార్చి 21) పర్షియన్ కొత్త సంవత్సరం ‘నవ్ రోజ్’ వేడుకల్లో మునిగి ఉన్న ప్రజలపై ఆత్మాహుతి దాడితో పంజా విసిరారు. ఈ బాంబు దాడిలో 26 మంది మృతి చెందగా.. మరో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబూల్‌ వర్సిటీ సమీపంలోని ఓ కాంkaపౌండ్‌లో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
Samayam Telugu kabul
కాబూల్ ఆత్మాహుతి దాడి..


ఘటనపై ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఇది ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకమేనని అధికారులు భావిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఆహ్లాదంగా గడుపుతున్న అమాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు పంజా విసరడంతో కాబూల్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.