యాప్నగరం

బీఎస్‌ఎఫ్ ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్ల హతం

కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. బీఎస్‌ఎఫ్ జరిపిన ప్రతి దాడుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు సహా ఓ ఉగ్రవాాది హతమయ్యాడు.

TNN 21 Oct 2016, 8:32 pm
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నాలుగు రోజులుగా జమ్మూ కశ్మీర్లోని భారత చెక్‌పోస్టులపై కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైన్యానికి బీఎస్‌ఎఫ్ గట్టి బుద్ధి చెప్పింది. శుక్రవారం కథువా జిల్లాలో సరిహద్దు వెంబడి తాము జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాకిస్థానీ రేంజర్లు మరణించారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) వెల్లడించింది. ఉదయం 9:30కు ప్రారంభమైన కాల్పులు 40 నిమిషాలపాటు కొనసాగాయని, ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టామని బీఎస్‌ఎఫ్ తెలిపింది. పాక్ కాల్పుల్లో భారత జవాను గాయపడ్డారని కూడా వెల్లడించింది. మళ్లీ మధ్యాహ్నం 12:15కు బాబియన్, హీరానగర్ సెక్టార్లలో పాక్ కాల్పులకు దిగిందని తెలుస్తోంది. గురువారం కథువా ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదుల చొరబడేందుకు ప్రయత్నించగా బీఎస్‌ఎఫ్ దాన్ని విఫలం చేసింది.
Samayam Telugu kathuva 7 pakistani rangers killed in retaliatory firing bsf
బీఎస్‌ఎఫ్ ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్ల హతం


సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత సైన్యం పీవోకేలోని ఉగ్రవాదులను మట్టుబెట్టిన నాటి నుంచి పాక్ తీవ్రంగా రగిలిపోతోంది. జమ్మూ ప్రాంతంలో మోర్టార్ షెల్స్‌, చిన్నపాటి ఆయుధాలతో దాడులకు దిగుతోంది. పాక్ కాల్పులకు భారత బలగాలు కూడా దీటుగా బదులిస్తున్నాయి. పాకిస్థాన్ కాల్పుల విరమణకు పాల్పడటంతో కథియా జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలీస్ యంత్రాంగం నిర్ణయించింది. బోబియా గ్రామ ప్రజలను ఇప్పటికే తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.