యాప్నగరం

జాదవ్ ఉరి అంశంలో భారత్‌కు భయపడబోమన్న పాక్

భారత్ హెచ్చరికలను పెడచెవిన పెడుతోంది పాక్. అంతేకాదు ఎలాంటి ముప్పునైనా తిప్పికొడతామంటోంది.

TNN 13 Apr 2017, 7:48 am
నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ఉరి విషయంలో పాక్ ఇంకా మొండిగానే వెళుతోంది. అతడిని ఉరి తీస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భారత్ హెచ్చరికను కూడా పెడచెవిన పెడుతోంది. జాదవ్ మరణశిక్ష విషయంలో తాము భారత నుంచే ఒత్తిళ్లకు, హెచ్చరికలకు తలవంచేది లేని పాక్ మంత్రి మరియం ఔరంగజేబ్ అన్నారు. న్యాయబద్ధంగా, చట్ట బద్ధంగా జాదవ్ అరెస్టు, విచారణ సాగిందని చెప్పుకొచ్చారు. పాక్ కేబినెట్ సమావేశంలో జాదవ్ మరణ శిక్ష అంశంపై ఏ చర్చా జరగలేదని స్పష్టం చేశారు. తాము చట్టానికి లోబడే అంతా చేశామని, అతిక్రమించి చేసింది ఏమీ లేదని చెప్పారు. అలగే జాదవ్ ను విడుదల చేయమని భారత్ నుంచి ఒత్తిళ్లేవీ రావడం లేదని కూడా చెప్పారు. పాక్ మంత్రి మాటలతో భారత్-పాక్ మధ్య సంబంధం మరింత జఠిలంగా, ఉద్రిక్తం మారుతోంది. కులభూషణ్ ను ఉరిని ఆపాలన్న లక్ష్యంతో భారత్ వెళుతోంది. కానీ పాక్ మాత్రం ఆ ఉరి అమలు చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది.
Samayam Telugu kulbhushan jadav death sentence row jadhav will not be spared says pak
జాదవ్ ఉరి అంశంలో భారత్‌కు భయపడబోమన్న పాక్


కాగా జాదవ్ అసలు పాక్ అధికారులకు ఎలా దొరికాడన్నది కూడా చర్చకొస్తోంది. అతను బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ సైన్యానికి దొరికాడని చెబుతున్నారు. కానీ జాదవ్ ను బలూచిస్థాన్ ప్రాంతంలో తాలిబన్లు కిడ్నాప్ చేసి, పాక్ నిఘా అధికారులకు అమ్మేశారని కూడా వాదన వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.