యాప్నగరం

జాదవ్ ఉరి తీర్పుతో పాక్ కుటుంబాల్లో నిరాశ

గూఢచర్యం ఆరోపణలపై భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించడం పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది.

TNN 10 Apr 2017, 6:42 pm
గూఢచర్యం ఆరోపణలపై భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. జాదవ్ కేసు పూర్వాపరాలు, ఉరిశిక్ష విధించడానికి సంబంధించిన వివరాలు తమకు వెల్లడించలేదని భారత హై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ హైకమిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. కులభూషణ్‌పై పాక్ న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 12 మంది ఖైదీల విడుదలను భారత్ చివరి నిమిషంలో ఆపేసింది. వాస్తవానికి వీరు బుధవారం తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంది.
Samayam Telugu kulbhushan jadhav death sentence india holds back release of pakistani prisoners scheduled for day after
జాదవ్ ఉరి తీర్పుతో పాక్ కుటుంబాల్లో నిరాశ


సత్ప్రవర్తన కారణంగా మార్చి 1న 39 మంది పాకిస్థాన్ ఖైదీలను విడుదల చేసిన భారత్.. ఈసారి కూడా 12 మందిని వారి దేశానికి తిప్పి పంపుదామని భావించింది. ఇరుదేశాల మధ్య సహృద్భావ వాతావరణ నెలకొల్పడానికి భారత్ కృషి చేస్తున్న సమయంలో పాక్ చర్య మన దేశానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. తమ వాళ్లు తిరిగొస్తారని ఎదురు చూస్తున్న ఆ కుటుంబాలు నిరాశకు లోనయ్యాయి.

గతేడాది మార్చి 3న జాదవ్‌ను పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకోగా.. తమ దేశానికి వ్యతిరేకంగా బలూచిస్థాన్‌లో కుట్రలు చేస్తున్నాడని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల ఆధారంగానే పాకిస్థాన్ మిలటరీ న్యాయస్థానం జాదవ్‌కు ఉరిశిక్షను ఖరారు చేసింది.

జాదవ్ ఉరిశిక్ష తీర్పు విషయమై సరబ్‌జీత్ కౌర్ సోదరి దల్బీర్ తీవ్రంగా స్పందించారు. న్యాయం కోసం భారత్ అంతర్జాతీయ న్యాయస్థాన్ని ఆశ్రయించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. జాదవ్‌ను ఉరితీయకుండా అడ్డుకోవాలన్నారు. ఒకవేళ జాదవ్ భారత ఏజెంట్ అయినా కూడా ఉరితీయాల్సిన అవసరం ఉందా అంటూ పాక్‌ను ప్రశ్నించారు. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన పాక్ జాతీయులను ఉరి తీశామా అని దల్బీర్ దాయాది దేశాన్ని నిలదీశారు. పాక్ జైళ్లో మగ్గుతూ సరబ్‌జీత్ కౌర్ 2013లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.