యాప్నగరం

India China Border పొరుగువారిని రెచ్చగొట్టడమే చైనా విధానం.. భారత్ తగిన రీతిలో స్పందించింది: అమెరికా

సరిహద్దుల్లో పొరుగుదేశాల పట్ల చైనా ధోరణి, విధానాలను అమెరికా తూర్పారబట్టింది. ప్రాదేశిక వివాదాలను రెచ్చగొట్టడమే చైనా పనిగా పెట్టుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మండిపడ్డారు.

Samayam Telugu 9 Jul 2020, 12:49 pm
భారత్ సరిహద్దుల్లో చైనా వ్యవహరించిన తీరును మరోసారి అమెరికా దుయ్యబట్టింది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం మాట్లాడుతూ.. డ్రాగన్ వైఖరిని తప్పుబట్టారు. తూర్పు లడఖ్‌లో భారత్‌తో ఇటీవల జరిగిన ఘర్షణలో చైనా చర్యలు నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. దీనికి దీటుగా స్పందించడానికి భారత్ కూడా తన వంతు కృషి చేసిందన్నారు. తన పొరుగు దేశాలతో చైనా తరచూ ప్రాదేశిక వివాదాలను ప్రేరేపించడమే పనిగా పెట్టుకుందని, ఈ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని ఆయన కోరారు.
Samayam Telugu చైనాపై మైక్ పాంపియో విమర్శలు
China India Border Disputes


Read Also:
యూపీ ఎన్‌కౌంటర్: ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు గ్యాంగస్టర్ అనుచరులు హతం
తాజాగా, భూటాన్‌తో సరిహద్దుల్లో చైనా వివాదం గురించి పాంపియో మాట్లాడుతూ.. ‘హిమాలయ పర్వత శ్రేణుల నుంచి వియత్నాం ప్రత్యేకమైన జోన్ సెంకాకు ద్వీపాల జలాల వరకు పొరుగు దేశాలతో ప్రాదేశిక వివాదాలను ప్రేరేపించే విధానాన్ని చైనా అలంభిస్తోంది.. ఇలాంటి బెదిరింపు ధోరణిని ప్రపంచ దేశాలు అనుమతించరాదని’ అన్నారు.

Read Also: బీజేపీ నేత ఇంటిపై దాడి.. జిల్లా అధ్యక్షుడి సహా ముగ్గుర్ని హత్యచేసిన ఉగ్రవాదులు

తమ భూభాగం సార్వభౌమాధికారం ఎక్కడ ముగుస్తుందో తమకు తెలుసని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దానిని గౌరవిస్తుందని పొరుగు దేశాలు సంతృప్తికరంగా చెప్పలేరు.. భూటాన్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. దీనిపై స్పందించడానికి ప్రపంచం కలిసి రావాలి’ అని ఆయన పిలుపు నిచ్చారు. దాదాపు, రెండు నెలల పాటు భారత్-చైనాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: కేరళ: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు.. సూపర్ స్ప్రెడర్లను గుర్తించడానికి కమాండోలు

గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు పాంపియో నివాళులర్పించిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు ఈ ఘటనలో అమరులయ్యారు. భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.