యాప్నగరం

London Bridge Attack: భారత సంతతి ఆఫీసర్ నేతృత్వంలో.. పాక్ ఉగ్రవాది హతం

లండన్ బ్రిడ్జిపై ఓ దుండగుడు రెచ్చిపోయాడు. చేతిలో కత్తితో.. కనిపించిన వారిపై దాడి చేసి హంగామా సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు.. అతణ్ని హతమార్చారు. లండన్ బ్రిడ్జి మీద దాడి చేసిన దుండగుణ్ని 28 ఏళ్ల ఉస్మాన్ ఖాన్‌‌గా గుర్తించారు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఇతడు.. ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలం ఉంది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో.. గతంలో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మీద బాంబు దాడికి యత్నించిన 9 మందిలో ఖాన్ ఒకడు.

Samayam Telugu 30 Nov 2019, 4:19 pm
లండన్ బ్రిడ్జిపై ఓ దుండగుడు రెచ్చిపోయాడు. చేతిలో కత్తితో.. కనిపించిన వారిపై దాడి చేసి హంగామా సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు.. అతణ్ని హతమార్చారు. లండన్ బ్రిడ్జి మీద దాడి చేసిన దుండగుణ్ని 28 ఏళ్ల ఉస్మాన్ ఖాన్‌‌గా గుర్తించారు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఇతడు.. ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలం ఉంది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో.. గతంలో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మీద బాంబు దాడికి యత్నించిన 9 మందిలో ఖాన్ ఒకడు.
Samayam Telugu london bridge attacker usman khan spent late teens in pakistan indian origin cop neil basu led anti terror operation
London Bridge Attack: భారత సంతతి ఆఫీసర్ నేతృత్వంలో.. పాక్ ఉగ్రవాది హతం


ఎలక్ట్రానిక్ ట్యాగ్ ఉన్నా..

ఖాన్‌ కదలికలపై నిఘా ఉంచడం కోసం పోలీసులు అతడికి ఎలక్ట్రానిక్ ట్యాగ్ అమర్చారు. అయినప్పటికీ అతడు ఎలా లండన్ బ్రిడ్జి మీద దాడి చేయగలిగాడనే దిశగా స్కాట్లాండ్ యార్డ్ భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నారు. 2012లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మీద దాడికి యత్నించిన ఖాన్‌ ఆరేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఏడాది క్రితమే అతడు బయట తిరగడానికి అనుమతి ఇచ్చారు.

కత్తితో దాడి..

బ్రిడ్జి పక్కన ఉన్న ఫిష్‌మాంగర్స్ హాల్‌లో లెర్నింగ్ టుగెదర్ పేరిట యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ఓ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దానికి హాజరైన ఖాన్.. అక్కడి నుంచి లండన్ బ్రిడ్జి మీదకు వెళ్తూ.. కనిపించిన ప్రతి ఒక్కరిపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు అతణ్ని అదుపులోకి తీసుకోగా.. తిరగబడటంతో కాల్చి చంపారు.

మట్టుబెట్టింది మనోడి నాయకత్వంలోనే..

లండన్ బ్రిడ్జి దాడికి పాల్పడిన నిందితుడిది పాకిస్థాన్ ఖాన్ కాగా.. అతణ్ని మట్టుబెట్టిన భద్రతా దళాలకు నాయకత్వం వహించింది భారత సంతతి ఆఫీసర్ నీల్ బసు కావడం గమనార్హం. లండన్ మెట్రపాలిటన్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్‌గా బసు పని చేస్తున్నారు. స్కాట్లాండ్ యార్డ్ ఆఫీసర్‌ అయిన నీల్ బసును ఉగ్రవాద నిరోధక విభాగం చీఫ్‌గా 2018 మార్చిలో నియమించారు. కౌంటర్ టెర్రరిజం చీఫ్ అనేది.. బ్రిటిష్ పోలీసింగ్‌లోకెల్లా కఠినమైన ఉద్యోగంగా భావిస్తారు.

అర పౌండ్ ఖర్చుతో...

లండన్ బ్రిడ్జిపై దాడికి పాల్పడిన ఖాన్‌ను హతమార్చడం సరైందనేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు విచారణకు 2.6 లక్షల పౌండ్లు, జీవిత ఖైదీగా అతణ్ని మేపడానికి 7.5 లక్షల పౌండ్లు ఖర్చవుతుంది. కానీ అర పౌండ్ ఖర్చుతో రెండు బుల్లెట్లతో భద్రతా సిబ్బంది పని పూర్తి చేశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.