యాప్నగరం

శ్రీలంక ఎన్నికల్లో మరోసారి రాజపక్సకే పట్టం.. మూడింట రెండొంతల మెజార్టీ

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించింది శ్రీలంక. రెండుసార్లు వాయిదా పడటంతో ఎలాగైన పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లింది.

Samayam Telugu 7 Aug 2020, 10:16 am
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో మహీంద్ రాజపక్సే నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ (ఎస్‌ఎల్పీపీ) ఘన విజయం సాధించింది. ఎస్ఎల్పీపీ మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. దీంతో శ్రీలంక ప్రధానిగా మహీంద్ రాజపక్సే కొనసాగనున్నారు. గత నవంబరు నుంచి రాజపక్సే ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ రాజపక్సే పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు గోటాబయ రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నారు.
Samayam Telugu మహీంద్ రాజపక్సే
Sri Lanka Elections


కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలోనూ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం విశేషం. కోవిడ్ కారణంగా గతంలో రెండుసార్లు ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల్లో మహీంద్ రాజపక్సే విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంతో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విజయంతో శ్రీలంక పీపుల్స్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తన తమ్ముడిని గతేడాది డిసెంబర్‌లో 69 లక్షల మంది ఓటర్లు అధ్యక్షుడిని చేశారని, ఈసారి ఇలాంటి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.

ఇక, శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన మహీంద్ రాజపక్సేకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం రాజపక్సేతో మాట్లాడిన మోదీ.. పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ శ్రీలంక ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మహీంద్ రాజపక్సేకు ఫోన్ చేసిన అభినందించిన తొలి విదేశీ నేత మోదీయే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సంబంధాలు బలోపేతానికి కలిసి పనిచేస్తామని మోదీ, రాజపక్సే అన్నారు. తనకు ఫోన్ చేసి అభినందించిన మోదీకి రాజపక్సే ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తెలిపారు. శ్రీలంక ప్రజల బలమైన మద్దతుతో, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారాన్ని మరింత పెంచేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని మహీంద్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.