యాప్నగరం

అక్కడ ఫేక్ న్యూస్ రాస్తే పదేళ్లు జైలు...

మీడియాలో రోజూ ఎన్నో వార్తలొస్తుంటాయి. వాటిలో నిజాలతో పాటూ అవాస్తవాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు మలేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 26 Mar 2018, 6:39 pm
మీడియాలో రోజూ ఎన్నో వార్తలొస్తుంటాయి. వాటిలో నిజాలతో పాటూ అవాస్తవాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు మలేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియో స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా తప్పుడు వార్తలు రాస్తే కఠినమైన శిక్షను అమలు చేసేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఈ యాంటీ ఫేక్ న్యూస్ బిల్‌ను ఆ దేశ అధ్యక్షుడు నజీబ్ రజాక్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఒకవేళ ఎవరన్నా తప్పుడు వార్తలు రాస్తే... వారికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. లేదంటే అక్కడి కరెన్సీలో ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు. మన కరెన్సీలో చెప్పాలంటే 80 లక్షల రూపాయలు. ఒక్కోసారి రెండు శిక్షలు పడే అవకాశం ఉంది.
Samayam Telugu Fake News..


డిజిటల్ పబ్లికేషన్స్, సోషల్ మీడియాకు కూడా ఈ ఫైన్ వర్తిస్తుందట. అలాగే విదేశాల్లో ఉండే మలేషియా ప్రజలకు కూడా ఫేక్ న్యూస్ వల్ల ఇబ్బంది కలగకుండా వారికి కూడా జరిమానా విధిస్తారట. త్వరలోనే ఈ బిల్లు చట్టం రూపంలో రాబోతోందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.