యాప్నగరం

Mosquito Bite మాయదారి దోమ ఎంత పనిచేసింది.. 30 సర్జరీలు, 4 సార్లు కోమాలోకి యువకుడు!

Mosquito Bite దోమల వల్ల మలేరియా, డెంగీ వంటి జ్వరాలతో పాటు ప్రాణాంతక వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయి. అయితే, సాధారణంగా దోమలు రాత్రివేళలో ఎక్కువగా కుడతాయి. కానీ, ఓ దోమ మాత్రం పగటి పూట కాటువేస్తుందట. ఇలా దోమ కాటు వేయడంతో ఓ యువకుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దాని విషం కారణంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి రావడమే కాదు.. నాలుగు సార్లు కోమాలోకి వెళ్లాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 29 Nov 2022, 7:38 am

ప్రధానాంశాలు:

  • యువకుడ్ని కుట్టిన ఏషియన్ టైగర్ దోమ
  • కొన్నాళ్లు పనిచేయని శరీర అవయవాలు
  • 30 సర్జీలు అనంతరం కోలుకున్న బాధితుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mosquito Bite
Mosquito Bite దోమ కుడితే సాధారణ జ్వరం లేదా మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు బారినపడి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. దీంతో పాటు దురద.. ఒంటిపై దద్దుర్లు కూడా వస్తాయి. కానీ, దోమ కాటుకు ఓ వ్యక్తి 30 సర్జరీలు చేయించుకోవాల్సి రావడమే కాదు.. నాలుగు సార్లు కోమాలోకి వెళ్లాడు. మాయదారి దోమ కుట్టడంతో జర్మనీలోని రోడెర్మార్‌ నగరానికి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్‌ రోట్ష్కే అనే యువకుడు చావు అంచుల దాకా వెళ్లడం గమనార్హం. దాని ప్రభావంతో ఇప్పటివరకు 30 సర్జరీలు చేయించుకున్నట్టు అంతర్జాతీయ పత్రిక డెయిలీ స్టార్ కథనం వెలువరించింది.
డెయిలీ స్టార్ కథనం ప్రకారం.. 2021 వేసవిలో సెబాస్టియన్‌ను ఓ దోమ కుట్టింది. తర్వాత కొద్దిరోజులకు అతడికి ఫ్లూ వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నాడు. కానీ, క్రమంగా అతడి రెండు కాలి వేళ్లు తెగిపోయినట్లుగా మారిపోతుండటంతో వాటిని సరిచేసేందుకు 30సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు నాలుగుసార్లు కోమాలోకి కూడా వెళ్లిపోయాడని పేర్కొంది. అంతేకాదు కాలేయం, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు కొద్ది రోజులు సరిగా పనిచేయలేదని, రక్తం విషపూరితమైందని సెబాస్టియన్ తనకు ఎదురైన అనుభవాన్ని ఆ పత్రికతో పంచుకున్నాడు.

తర్వాత ఎడమ తొడపై ఏర్పడిన గడ్డను మరోసారి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించి చర్మాన్ని అతికించారని తెలిపారు. కణజాల నమూనా ప్రకారం ప్రాణాంతక బ్యాక్టీరియా ఎడమ తొడపై దాదాపు సగం వరకు మాయం అయినందున తను ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావించినానని చెప్పాడు. ఈ క్రమంలో చాలాసార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చానని, వైద్యులు ఎప్పటికప్పుడు వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స అందించడంతో బతికి బయటపడ్డానని సెబాస్టియన్‌ పేర్కొన్నారు.

కాగా, సెబాస్టియన్‌ను ఏషియన్‌ టైగర్‌ దోమ కుట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎక్కువగా పగటిపూట కుట్టే ఈ దోమలవల్ల డెంగీ వంటి విష జ్వరాలతోపాటు జికా వైరస్‌, వెస్ట్‌ నైల్‌ వైరస్‌, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దోమ తెరలు వాడటంతోపాటు ఇతర జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.