యాప్నగరం

వాటికన్ చర్చ్ ఎదుట నగ్నంగా నిలబడి.. వీపుపై ఆ పెయింటింగ్‌తో నిరసన

క్రైస్తవ మత పెద్ద పోప్ నివాస నగరం వాటికన్ సిటీలో గురువారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెయింటర్ పీటర్స్ బాసిలికా చర్చి వద్ద ఓ వ్యక్తి పూర్తిగా బట్టల్లేకుండా నిలబడి నిరసన తెలిపాడు. అయితే, ఆయన నిరసన వెనుక మంచి ఉద్దేశమే ఉన్నా.. ఇలా నగ్నంగా తెలపడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఇలాంటి ఘటన జరిగింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 2 Jun 2023, 3:22 pm

ప్రధానాంశాలు:

  • గత 15 నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం
  • ఉక్రెయిన్ పిల్లలను కాపాడాలని ఓ వ్యక్తి వినూత్న నిరసన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vatican Church
ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా వాటికన్ సిటీ చర్చి వద్ద ఓ వ్యక్తి తన ఒంటిపై బట్టలు విప్పి నిరసన తెలియజేయడం కలకలం రేగింది. స్థానిక కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి వద్ద గుర్తుతెలియని వ్యక్తి తన వీపుపై ఉక్రెయిన్ పిల్లలను రక్షించాలని పెయింటింగ్ వేసుకుని నిరసన తెలిపాడు. చర్చి బలిపీఠం వద్ద నగ్నంగా నిరసన తెలిపిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగ్నంగా ఉన్న అతడి ఫోటోలు, వీడియోలను పర్యాటకులు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వాటికన్ వర్గాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి వేలిగోళ్ల నుంచి శరీరంపై గాయాలతో ఉన్నాడని రాయిటర్స్ నివేదించింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న వాటికన్ గార్డులు.. ఇటలీ పోలీసులకు అప్పగించారు. అతడు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. గురువారం మధ్యాహ్నం చర్చిని మూసివేయడానికి కొద్ది క్షణాల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. 2016లో సెయింట్ పీటర్స్ బాసిలికా కాంప్లెక్స్‌లో కేవలం బ్యాక్‌ప్యాక్‌ను ధరించి ఇద్దరు ట్రైనర్లతో నగ్నంగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


అతడ్ని బ్రెజిల్ సంతతికి చెందిన ఇటలీ పౌరుడు లూయిస్ కార్లోస్ చెరుబినోగా గుర్తించారు. చర్చిలో పోప్ ప్రసంగం సాగుతున్న సమయంలో తన ఒంటిపై బట్టలు విప్పి నగ్నంగా నడుచుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అరెస్ట్ చేశారు. కాగా, గత 15 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. మాస్కో సైన్యాలను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది శరణార్ధులుగా మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో ఐరోపా శరణార్ధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.