యాప్నగరం

బ్రిటన్‌లో ఆత్మాహుతి దాడి: 19మంది మృతి

ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాంచెస్టర్ నగరంలో భారీ పేలుడు చోటు చేసుకుంది.

TNN 23 May 2017, 7:50 am
ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాంచెస్టర్ నగరంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. సంగీత కచేరీ జరుగుతున్న ప్రాంతంలో ఓ వ్యక్తి తనని తాను పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 19 మంది అక్కడి కక్కడే మరణించగా, యాభైమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగ్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీ దగ్గర ఈ బాంబుపేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నారు బ్రిటన్ పోలీసులు. అయితే ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా అది తమ చర్యగా ప్రకటించుకోలేదు. భద్రతా దళాలు హుటాహుటిన సంఘటనస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర సమయంలో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పాప్ సింగర్ అరియానా గ్రాండే క్షేమంగా ఉన్నట్టు ఆమె తరపు ప్రతినిధి ప్రకటించారు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు సాగుతున్నాయి.
Samayam Telugu manchester explosion 19 dead 50 injured in a blast
బ్రిటన్‌లో ఆత్మాహుతి దాడి: 19మంది మృతి


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.