ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. నిత్యావసరాల కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా రాజధాని కొలంబోలోని ప్రధాన బీచ్ ఫ్రంట్లోని గాల్ఫేస్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసన తెలుపుతున్నారు. ప్రధాని మహీందా రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వారిని రాజీనామా చేయాలని, వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు మంచి భవిష్యత్తు కావాలంటూ నినదిస్తూ ప్లకార్డులు, బ్యానర్లతో చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రదర్శనలో భాగం అయ్యారు.
అలసిపోయాం.. మాకొద్దు ఈ పాలన..
ఈ ప్రభుత్వంతో అలసిపోయామని, ప్రధానమంత్రి మహింద రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సలతో దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని నిరసనకారులు అంటున్నారు. వారిద్దరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, వారు ఇక్కడున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ బాగుపడదని విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి ఎలాంటి ప్రణాళిక లేదని, దేశాన్ని ఎలా నడిపించాలో తెలియదని ఎద్దేవ చేశారు. రాజపక్సే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, వారిని తొలగించి మా రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం అని అంటున్నారు.
ఐదు రోజులు ట్రేడింగ్కు బ్రేక్
మరోపక్క శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే విదేశీ అప్పులను తీర్చలేమని ప్రభుత్వం చేతుల ఎత్తేసింది. ఖజానా ఖాళీ అవ్వడంతో రుణాలను చెల్లించలేమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ 18 నుంచి ఐదు రోజుల పాటు ట్రేడింగ్ జరగదని శనివారం వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ గండం నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిధుల సమీకరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు బిలియన్ డాలర్ల సాయం కోసం శ్రీలంక ప్రతినిధులు వాషింగ్టన్ను ఆశ్రయించారు.
కోటా పద్ధతిలో పెట్రోల్, డీజిల్
ఇదిలాఉండగా శ్రీలంక పెట్రోలియం కంపెనీలు ఇంధన కోటా పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. రేషన్ విధానాన్ని అవలంబిస్తున్నట్టు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటనలో తెలిపింది. దీనిప్రకారం ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్ల్లో కేవలం వెయ్యి రూపాయల వరకు ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఆటో డ్రైవర్లు రూ.15 వందలు, కార్లు, జీపులు, వ్యాన్ల వాహనదారులు రూ.5 వేల వరకు ఇంధనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అయితే రేషన్ పద్ధతిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రోజంతా విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు అవస్థలుపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చోటుచేసుకుంది
అలసిపోయాం.. మాకొద్దు ఈ పాలన..
ఈ ప్రభుత్వంతో అలసిపోయామని, ప్రధానమంత్రి మహింద రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సలతో దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని నిరసనకారులు అంటున్నారు. వారిద్దరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, వారు ఇక్కడున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ బాగుపడదని విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి ఎలాంటి ప్రణాళిక లేదని, దేశాన్ని ఎలా నడిపించాలో తెలియదని ఎద్దేవ చేశారు. రాజపక్సే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, వారిని తొలగించి మా రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం అని అంటున్నారు.
ఐదు రోజులు ట్రేడింగ్కు బ్రేక్
మరోపక్క శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే విదేశీ అప్పులను తీర్చలేమని ప్రభుత్వం చేతుల ఎత్తేసింది. ఖజానా ఖాళీ అవ్వడంతో రుణాలను చెల్లించలేమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ 18 నుంచి ఐదు రోజుల పాటు ట్రేడింగ్ జరగదని శనివారం వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ గండం నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిధుల సమీకరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు బిలియన్ డాలర్ల సాయం కోసం శ్రీలంక ప్రతినిధులు వాషింగ్టన్ను ఆశ్రయించారు.
కోటా పద్ధతిలో పెట్రోల్, డీజిల్
ఇదిలాఉండగా శ్రీలంక పెట్రోలియం కంపెనీలు ఇంధన కోటా పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. రేషన్ విధానాన్ని అవలంబిస్తున్నట్టు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటనలో తెలిపింది. దీనిప్రకారం ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్ల్లో కేవలం వెయ్యి రూపాయల వరకు ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఆటో డ్రైవర్లు రూ.15 వందలు, కార్లు, జీపులు, వ్యాన్ల వాహనదారులు రూ.5 వేల వరకు ఇంధనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అయితే రేషన్ పద్ధతిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రోజంతా విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు అవస్థలుపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చోటుచేసుకుంది