యాప్నగరం

తీవ్ర అస్వస్థతకు గురైన కోవిడ్ రోగుల్లో గుండెపోటు సాధారణమే.. మిచిగాన్ స్టడీ

కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఎక్కువ మంది గుండెపోటుకు గురువుతున్నారు. దీనికి గల కారణాలపై చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Samayam Telugu 2 Oct 2020, 10:21 am
కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తుల్లో ముఖ్యంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు గుండెపోటుకు గురికావడం సాధారణమేనని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. 80ఏళ్లు పైబడినవారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కొవిడ్‌ సోకిన వృద్ధుల్లో మరణానికి గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేపట్టిన అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. వారిలో గుండెపోటు రావడాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయన ఫలితాలను బీఎంజే జర్నల్‌లో ప్రచురించారు.
Samayam Telugu కరోనా బాధితుల్లో గుండెపోటు


Read Also: సత్యమనే శక్తితో అబద్ధాలను ఓడిస్తాం.. హథ్రాస్ ఘటన‌పై రాహుల్ వ్యాఖ్యలు
పరిశోధనలో భాగంగా 68 ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న 18 ఏళ్లుదాటిన 5,019 కొవిడ్‌-19 రోగులను పరిశీలించారు. వీరిలో 701(14శాతం) మంది ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. వీరిలో 400 (57శాతం) మందిని మాత్రమే సీపీఆర్‌ అందించడం ద్వారా కాపాడగలిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

Read Also: కోవిడ్-19 టీకా నిల్వ, పంపిణీపై ప్లాన్ రూపొందించండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

అయితే, ఇలా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారు కేవలం స్వల్ప సీపీఆర్‌ ద్వారా ప్రాణాలతో బయటపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 80ఏళ్లు పైబడిన వారిలోనే ప్రాణాపాయం తలెత్తుతున్నట్లు నిపుణులు స్పష్టంచేశారు. ఇలాంటి వారికి సీపీఆర్‌ చేసినప్పటికీ గుండె ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగానే ఉంటున్నట్లు నిర్ధారించారు.

Read Also: ట్రంప్ సలహా బృందంలో ఒకరికి కరోనా.. ఇటీవలే అధ్యక్షుడితో కలిసి ప్రయాణం!

అయితే, ఇలాంటివారు చికిత్స పొందుతున్న హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు, నిపుణులైన వైద్య సిబ్బందితోపాటు ఇతర ముఖ్యమైన అంశాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పరిశోధన బృందం వెల్లడించింది. తీవ్ర అస్వస్థతకు గురై సీపీఆర్ చేసిన రోగుల్లో 12 శాతం మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం 7 శాతం మంది మాత్రమే సాధారణ లేదా స్వల్పంగా బలహీనమైన నాడీ స్థితితో ఉన్నారని తేలింది.

Read Also: హెచ్-1బీ వీసాపై నిషేధం.. ట్రంప్‌ ప్రభుత్వానికి కాలిఫోర్నియా కోర్టు ఝలక్

80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో మూడు శాతం మందితో పోలిస్తే, 45 ఏళ్లు దాటిన రోగులలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఉన్న లేదా కార్డియాక్ అరెస్ట్‌కు గురైన కోవిడ్ బాధితుల గురించి సంక్లిష్ట నిర్ణయం తీసుకోవడంలో రోగులు, కుటుంబసభ్యులు, వైద్యులకు తెలియజేయడానికి మా అధ్యయన వివరాలు సహకరిస్తాయని పరిశోధకులు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.