యాప్నగరం

Accident in Nepal: లోయలో పడిన ట్రక్, 20 మంది దుర్మరణం

ట్రక్ లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 15 Dec 2018, 5:19 pm
నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్ సమీపంలోని నువాకోట్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu 1544863865-Nepal-truck-crash-kills-20-mourners-THINKSTOCK


ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు గయాంగడండా ప్రాంతానికి రాగానే అదుపుతప్పి 400 మీటర్లో లోతైన లోయలో పడిపోయింది. దీంతో ట్రక్కు నుజ్జుకావడంతో పాటు ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రం గాయపడినవారు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనపై బీమ్‌రావు భట్టరియా మాట్లాడుతూ.. ట్రక్కులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.