యాప్నగరం

Nepal plane missing: నేపాల్ విమానం అదృశ్యం, ఫ్లైట్‌లో 22 మంది, నలుగురు భారతీయులు

22 మందితో ప్రయాణిస్తోన్న నేపాల్ విమానం అదృశ్యమైంది. ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది. దాంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ఆచూకి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. హెలికాప్టర్లను పంపించి విమానం కోసం గాలిస్తున్నారు. కాగా విమానంలో సిబ్బందితో సహా 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, నేపాలీ పౌరులు ఉన్నారు. విమానం గల్లంతుతో అందరిలో ఆందోళన నెలకొంది. గతేడాది చైనాలో ఓ ఫ్లైట్ ఇలానే అదృశ్యమై కూలిపోయింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 29 May 2022, 12:02 pm
నేపాల్‌కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. (Nepal plane missing) అందులో 22 మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్ ఇంజిన్ విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్‌పోర్ట్ అధికారులతో కాంటాక్ట్‌ను కోల్పోయింది. పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తున్న ఫ్లైట్ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయింది. ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే రాడార్ నుంచి కమ్యూనికేషన్‌లో లేకుండాపోయింది.
Samayam Telugu Nepal plane missing: నేపాల్ విమానం అదృశ్యం, ఫ్లైట్‌లో 22 మంది, నలుగురు భారతీయులు


విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, జపాన్‌కు చెందిన వారు ముగ్గురు, సిబ్బందితో సహా 15 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. ఆ విమానం కోసం అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. విమానం ఆచూకీ కోసం హెలికాప్టర్‌లను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా "విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కనిపించింది. తర్వాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది. ఆ తర్వాత దాంతో కమ్యూనికేషన్ తెగిపోయింది." అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.

కాగా గత ఏడాది మార్చిలో చైనాలోని గ్వాంగ్జి ప్రాంతంలో ఓ విమానం ప్రమాదం సభవించింది. చైనా ఈస్ట్రర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అదృశ్యమైంది. ఆ ఫ్లైట్ 132 మంది ప్రయాణికులతో కున్నింగ్ నుంచి గ్వాంగ్‌జౌకు బయల్దేరించింది. ఎయిర్‌పోర్ట్ అధికారులతో కమ్యూనికేషన్‌ తెగిపోయిన ఆ ఫ్లైట్ వుజౌ నగరానికి సమీపంలో అది కూలిపోయింది. దాంతో అందులో ఉన్న 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఆ ఘటనపై రకరకాల కథనాలు బయటకొచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.