నేపాల్కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. (Nepal plane missing) అందులో 22 మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. తారా ఎయిర్కు చెందిన 9 NAET ట్విన్ ఇంజిన్ విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ అధికారులతో కాంటాక్ట్ను కోల్పోయింది. పోఖారా నుంచి నేపాల్లోని జోమ్సోమ్కు వెళ్తున్న ఫ్లైట్ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయింది. ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే రాడార్ నుంచి కమ్యూనికేషన్లో లేకుండాపోయింది.
విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, జపాన్కు చెందిన వారు ముగ్గురు, సిబ్బందితో సహా 15 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. ఆ విమానం కోసం అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. విమానం ఆచూకీ కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా "విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కనిపించింది. తర్వాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది. ఆ తర్వాత దాంతో కమ్యూనికేషన్ తెగిపోయింది." అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.
కాగా గత ఏడాది మార్చిలో చైనాలోని గ్వాంగ్జి ప్రాంతంలో ఓ విమానం ప్రమాదం సభవించింది. చైనా ఈస్ట్రర్న్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అదృశ్యమైంది. ఆ ఫ్లైట్ 132 మంది ప్రయాణికులతో కున్నింగ్ నుంచి గ్వాంగ్జౌకు బయల్దేరించింది. ఎయిర్పోర్ట్ అధికారులతో కమ్యూనికేషన్ తెగిపోయిన ఆ ఫ్లైట్ వుజౌ నగరానికి సమీపంలో అది కూలిపోయింది. దాంతో అందులో ఉన్న 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఆ ఘటనపై రకరకాల కథనాలు బయటకొచ్చాయి.
విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, జపాన్కు చెందిన వారు ముగ్గురు, సిబ్బందితో సహా 15 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. ఆ విమానం కోసం అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. విమానం ఆచూకీ కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా "విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కనిపించింది. తర్వాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది. ఆ తర్వాత దాంతో కమ్యూనికేషన్ తెగిపోయింది." అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.
కాగా గత ఏడాది మార్చిలో చైనాలోని గ్వాంగ్జి ప్రాంతంలో ఓ విమానం ప్రమాదం సభవించింది. చైనా ఈస్ట్రర్న్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అదృశ్యమైంది. ఆ ఫ్లైట్ 132 మంది ప్రయాణికులతో కున్నింగ్ నుంచి గ్వాంగ్జౌకు బయల్దేరించింది. ఎయిర్పోర్ట్ అధికారులతో కమ్యూనికేషన్ తెగిపోయిన ఆ ఫ్లైట్ వుజౌ నగరానికి సమీపంలో అది కూలిపోయింది. దాంతో అందులో ఉన్న 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఆ ఘటనపై రకరకాల కథనాలు బయటకొచ్చాయి.