యాప్నగరం

భారత్‌లో భారీగా కేసులు.. నేపాల్ కీలక నిర్ణయం

ఇండియాలో పెరిగిపోతున్న కరోనా కేసులతో నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించుకుంది. అయితే అన్ని సరిహద్దులు కాదని తెలుస్తోంది.

Samayam Telugu 1 May 2021, 9:41 pm
దేశంలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా నాలుగు లక్షల కేసులు నమోదవడం పొరుగు దేశాలను కూడా కలవరపెడుతోంది. భారత్‌లో కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి సాధ్యమైనంత మేర రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించింది. ఇండియా - నేపాల్ సరిహద్దులో సుమారు 22 చోట్ల రాకపోకలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిన్న కోవిడ్‌ పరిస్థితులపై సమీక్షించిన నేపాల్ ఇరుదేశాల నడుమ ఉన్న 35 సరిహద్దు పాయింట్లలో 22 మూసివేయాలని నిర్ణయించింది. మిగిలిన 13 సరిహద్దు పాయింట్లు తెరిచే ఉంటాయి. భారత్‌లో శనివారం 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు 3,523 మంది మృత్యువాతపడ్డారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
nepal border


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.