యాప్నగరం

అమెరికాలో బాంబు పేలుడు..

అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌ ప్రాంత సమీపంలో భారీ బాంబు పేలుడుకు ప్లాన్ వేశారు. అక్కడ అమర్చిన పైప్ బాంబు సరిగా పేలకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

TNN 11 Dec 2017, 10:56 pm
అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌ ప్రాంత సమీపంలో భారీ బాంబు పేలుడుకు ప్లాన్ వేశారు. అక్కడ అమర్చిన పైప్ బాంబు సరిగా పేలకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు గాయపడ్డారు. మాన్‌హట్టన్‌ పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్‌ వద్ద సోమవారం (డిసెంబర్ 11) ఈ పేలుడు జరిగింది. ఊహించని పరిణామంతో బస్సు టెర్మినల్‌ వద్ద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అమెరికాలో అతిపెద్ద పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్‌ ఇదే కావడం గమనార్హం.
Samayam Telugu new york explosion at manhattan bus terminal
అమెరికాలో బాంబు పేలుడు..


క్రిస్మస్‌ వేడుకలో మునిగిపోయిన అమెరికాకు ఇదే అదనుగా షాక్‌ ఇవ్వాలని ఉగ్రవాదులు భావించినట్లున్నారు. బస్సు టెర్మినల్ వద్ద ఓ దుందగుడు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో శక్తిమంతమైన పైప్‌ బాంబులను పేల్చేందుకు ప్రయత్నించాడు. బాంబును సరిగా పేల్చడంలో విఫలమై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు అతణ్ని అదుపులోకి తీసుకొని, బాంబును నిర్వీర్యం చేశాయి.

ఒకవేళ బాంబు సరిగా పేలి ఉంటే ఘోర విషాదం జరిగి ఉండేదని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ముందుగానే హెచ్చరించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.