యాప్నగరం

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 31 మంది మృతి

నార్త్ ఈస్ట్ నైజిరియాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. రెండుసార్లు జరిగిన దాడుల్లో 31 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు.

TNN 17 Jun 2018, 9:34 pm
నార్త్ ఈస్ట్ నైజిరియాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. రెండుసార్లు జరిగిన దాడుల్లో 31 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డామ్‌ బోవ సిటీలో రంజాన్ సందర్భంగా శనివారం(జూన్ 16) రాత్రి ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగింది. మెదట ఆత్మాహుతి దాడి చేసిన టెర్రరిస్టులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీంతో అధిక ప్రాణనష్టం సంభవించింది.
Samayam Telugu Boko Haram


ఆత్మాహుతి దాడిలో చనిపోయిన వారికన్నా రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు తామే కారణమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. అయితే ఇది కచ్చితంగా ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ బొకోహరమ్‌ తీవ్రవాదుల పనే అని అధికారులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.