నార్త్ కొరియాను కూడా కరోనా చుట్టేసింది. ఇప్పటి వరకూ తమ దేశంలో కోవిడ్ కేసులు నమోదు కాలేదన్న కిమ్ రాజ్యంలో కోవిడ్ మరణం నమోదైంది. ఆ దేశంలో మొదటి కరోనా కేసు గురువారం రిజిస్టర్ కాగా, ఒక్క రోజులోనే వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించినట్టు నార్త్ కొరియా నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్లో జ్వరంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ను గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఆ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు లేకపోవడం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు నార్త్ కొరియాకు టీకాలు సరఫరా చేసేది లేదని యూఎస్ వెల్లడించింది.
కరోనాను ఎదుర్కోవాలన్న కిమ్..
కాగా ఏప్రిల్ చివరి నుంచి లక్షలాది మంది జ్వరంతో బాధపడుతుండగా ప్రస్తుతం 16 వేల మందికిపై చికిత్స పొందుతున్నారని అధికారికంగా తెలుస్తుంది. కరోనా కేసులు వెలుగు చూడడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ వైరస్ కమాండ్ సెంటర్ను యాంటీ వైర్ కమాండ్ సెంటర్ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే శాస్త్రీయ వైద్య విధానంతోనూ కరోనాను ఎదుర్కోవాలని కిమ్ సూచించినట్టు తెలుస్తుంది. సకాలంలో మందులను సరఫరా చేయడం, జ్వరంతో బాధపడుతున్న వారికి వెంటనే టెస్ట్లు చేయడం, చికిత్స అందించడం చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్లు లేవు.. కష్టమే..
ఈ క్రమంలోమ నార్త్ కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పిన కిమ్.. మొదటిసారిగా మీడియాలో మాస్క్ ధరించి కనిపించారు. మరోవైపు నార్త్ కొరియా దగ్గర కోవిడ్ టీకాలు లేవని, ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండడంతో దేశ ప్రజలకు ముప్పు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో నార్త్ కొరియా కోవిడ్ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో చూడాలంటున్నారు.
టీకాలు ఇవ్వం : యూఎస్
నార్త్ కొరియాలో కరోనా ఎంటర్ అయిన నేపథ్యంలో యూఎస్ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఆ దేశానికి వ్యాక్సిన్లు పంపించే ప్రసక్తే లేదని యూఎస్ తెలిపింది. గతంలో కోవాగ్జిన్ (COVAX)గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కివ్యాక్సిన్ విరాళాలను ఉత్తర కొరియా పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. కానీ నార్త్ కొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దతు ఇస్తామని తెలిపింది.
కరోనాను ఎదుర్కోవాలన్న కిమ్..
కాగా ఏప్రిల్ చివరి నుంచి లక్షలాది మంది జ్వరంతో బాధపడుతుండగా ప్రస్తుతం 16 వేల మందికిపై చికిత్స పొందుతున్నారని అధికారికంగా తెలుస్తుంది. కరోనా కేసులు వెలుగు చూడడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ వైరస్ కమాండ్ సెంటర్ను యాంటీ వైర్ కమాండ్ సెంటర్ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే శాస్త్రీయ వైద్య విధానంతోనూ కరోనాను ఎదుర్కోవాలని కిమ్ సూచించినట్టు తెలుస్తుంది. సకాలంలో మందులను సరఫరా చేయడం, జ్వరంతో బాధపడుతున్న వారికి వెంటనే టెస్ట్లు చేయడం, చికిత్స అందించడం చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు.
ఈ క్రమంలోమ నార్త్ కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పిన కిమ్.. మొదటిసారిగా మీడియాలో మాస్క్ ధరించి కనిపించారు. మరోవైపు నార్త్ కొరియా దగ్గర కోవిడ్ టీకాలు లేవని, ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండడంతో దేశ ప్రజలకు ముప్పు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో నార్త్ కొరియా కోవిడ్ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో చూడాలంటున్నారు.
టీకాలు ఇవ్వం : యూఎస్
నార్త్ కొరియాలో కరోనా ఎంటర్ అయిన నేపథ్యంలో యూఎస్ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఆ దేశానికి వ్యాక్సిన్లు పంపించే ప్రసక్తే లేదని యూఎస్ తెలిపింది. గతంలో కోవాగ్జిన్ (COVAX)గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కివ్యాక్సిన్ విరాళాలను ఉత్తర కొరియా పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. కానీ నార్త్ కొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దతు ఇస్తామని తెలిపింది.