యాప్నగరం

ఉత్తరకొరియాలో అణు ప్రమాదం.. 200 మంది మృతి

ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగేరీ ప్రాంతంలో ఓ అణు ప్రయోగ స్థలంలో జరిగిన ప్రమాదంలో 200 మంది దుర్మరణం పాలయ్యారు. భారీ సొరంగం కుప్పకూలడం వల్ల ఈ ఘటన జరిగింది. మంగళవారం (అక్టోబర్ 31) జపాన్‌ మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది.

TNN 31 Oct 2017, 10:50 pm
ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగేరీ ప్రాంతంలో ఓ అణు ప్రయోగ స్థలంలో జరిగిన ప్రమాదంలో 200 మంది దుర్మరణం పాలయ్యారు. భారీ సొరంగం కుప్పకూలడం వల్ల ఈ ఘటన జరిగింది. మంగళవారం (అక్టోబర్ 31) జపాన్‌ మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. అక్టోబర్‌ 10న మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపడుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు జపాన్ మీడియా పేర్కొంది. మొదట సొరంగం కొంత భాగం కూలిపోయి.. చాలా మంది మృత్యువాతపడ్డారు. మరో 100 మంది వరకూ సొరంగం లోపల చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపడుతుండగా మిగిలిన భాగం కూడా కూలిపోయింది. దాంతో లోపల చిక్కుకున్న 100 మంది సజీవ సమాధి అయ్యారు.
Samayam Telugu nuclear tunnel collapses in north korea 200 people died
ఉత్తరకొరియాలో అణు ప్రమాదం.. 200 మంది మృతి


ఈ ఘటనపై ఇప్పటివరకు ఉత్తరకొరియా స్పందించలేదు. కొన్ని రోజుల కిందట ఆ దేశం.. హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడం వల్ల ప్రమాదం జరిగిన ప్రదేశం బాగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఈ ఘోరం జరిగిందని జపాన్‌ మీడియా తెలిపింది. భూ ఉపరితలానికి సమీపంలో అణు ప్రయోగాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. ఈ మాటలను లెక్కచేయని కిమ్‌.. వందల మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు.

2006 తర్వాత అణు పరీక్షల కారణంగా కొండచరియలు విరిగిపడే సూచనలు కన్పించినట్లు శాటిలైట్‌ ఫొటోల్లో తేలింది. ఈ ఫొటోలను ఉత్తర కొరియా వెబ్‌సైట్‌ పోస్ట్‌ చేసింది. అణు ప్రయోగం చేసినప్పుడు పరిసర ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 4.1 తీవ్రతతో ప్రకంపనలు కూడా సంభవించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.