పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను అవినీతికి పాల్పడిన కేసులు వెంటాడుతున్నాయి. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన షరీఫ్ తాజాగా మరో కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రెండు కేసుల్లో దోషిగా తేలిన షరీఫ్.. మూడో కేసులో సాక్ష్యాలు లేవని ఆయనను నిర్దోషిగా సోమవారం కోర్టు తీర్పు వెల్లడించింది. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి షరీఫ్పై మొత్తంగా మూడు కేసులు నమోదయ్యాయి. దీనిపై అకౌంటబిలిటీ కోర్టు జడ్జి మహమ్మద్ అర్షద్ మాలిక్ మరోసారి విచారణ జరిపారు. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అల్-అజీజియా స్టీల్ మిల్స్ ఏర్పాటులో షరీఫ్ అవినీతికి పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, ఆయన దోషి అని జస్టిస్ మాలిక్ తీర్పు వెలువరించారు. మూడో కేసు అయిన ఫ్లాగ్షిప్ పెట్టబడుల ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టు విశ్వసించింది. మాజీ ప్రధానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కాగా, పనామా పత్రాల వ్యవహారం బయటకు రాగానే 2017 జూలైలో పాక్ సుప్రీంకోర్ట్ షరీఫ్పై అనర్హత వేటు వేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 8న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆయనపై మూడు కేసులు నమోదుచేసింది. లండన్లోని లగ్జరీ ఫ్లాట్లు అవెన్ఫీల్డ్ ఆస్తుల కేసులో షరీఫ్ను గతేడాది జూలైలోనే కోర్టు దోషిగా తేల్చింది. ఆ కేసులో షరీఫ్కు 11 ఏళ్ల జైలు, ఆయన కూతురు మరియంకు ఎనిమిదేళ్లు, అల్లుడు మహ్మద్ సఫ్దార్లకు కూడా జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ సెప్టెంబర్లో ఇస్లామాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేయగా.. షరీఫ్, మరియం, సఫ్దార్ విడుదలై బయటకు వచ్చారు. విచారణ నేపథ్యంలో నేడు షరీఫ్ కోర్టుకు హాజరయ్యారు.
కాగా, పనామా పత్రాల వ్యవహారం బయటకు రాగానే 2017 జూలైలో పాక్ సుప్రీంకోర్ట్ షరీఫ్పై అనర్హత వేటు వేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 8న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆయనపై మూడు కేసులు నమోదుచేసింది. లండన్లోని లగ్జరీ ఫ్లాట్లు అవెన్ఫీల్డ్ ఆస్తుల కేసులో షరీఫ్ను గతేడాది జూలైలోనే కోర్టు దోషిగా తేల్చింది. ఆ కేసులో షరీఫ్కు 11 ఏళ్ల జైలు, ఆయన కూతురు మరియంకు ఎనిమిదేళ్లు, అల్లుడు మహ్మద్ సఫ్దార్లకు కూడా జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ సెప్టెంబర్లో ఇస్లామాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేయగా.. షరీఫ్, మరియం, సఫ్దార్ విడుదలై బయటకు వచ్చారు. విచారణ నేపథ్యంలో నేడు షరీఫ్ కోర్టుకు హాజరయ్యారు.