యాప్నగరం

భారత్‌తో మైత్రికి ప్రయత్నించండి: పాక్ ఆర్మీ చీఫ్ సూచన

భారత్- పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. భారత్‌లో బలమైన సంబంధాలకు ప్రయత్నించాలని ఆయన సూచించారు.

TNN 21 Dec 2017, 9:52 am
భారత్‌తో మెరుగైన సంబంధాలకు ప్రయత్నించాలని, ఈ విషయంలో సైన్యం సహకారం పూర్తిగా ఉంటుందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆ దేశాధినేతలకు హితవు పలికారు. ఇండియా, అమెరికాల మధ్య మైత్రి మరింత బలపడుతోన్న నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన పార్లమెంటరీ ఫోరమ్‌లో జావేద్ బజ్వా మాట్లాడుతూ...భారత్‌తో సంబంధాలు సాధారణస్థితికి చేరుకోడానికి నేతలు ప్రయత్నిస్తే ఆర్మీ కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ సెనెట్ అధ్యక్షుడు రజా రబ్బానీ ఆహ్వానం మేరకు ఆర్మీ చీఫ్‌, ఐఎస్ఐ అధినేత నవేద్ ముఖ్తార్‌, మేజర్ జనరల్ షహీర్ షంషాద్ మీర్జా, అషిమ్ మునీర్‌తోపాటు ఆర్మీ ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Samayam Telugu pak army chief urges lawmakers to improve relations with india
భారత్‌తో మైత్రికి ప్రయత్నించండి: పాక్ ఆర్మీ చీఫ్ సూచన


నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. అన్ని పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగడానికి నాయకులు కృషి చేయాలని, అలాగే భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చడానికి ప్రయత్నించాలని జావేద్ అన్నట్లు పాక్ పత్రిక డాన్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో శాంతి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనే అవగాహనకు వచ్చినట్లు పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది. కానీ ఇండియా మాత్రం పాకిస్థానే లక్ష్యంగా చేసుకుని వారి సైన్యాన్ని మొహరిస్తోందని, పాక్‌లో తీవ్రవాదానికి, అస్థిరతకు ఆ దేశమే కారణమని ఆరోపించారు. అఫ్గన్ గూఢచారి సంస్థ, జాతీయ భద్రత డైరెక్టరేట్‌తో భారత్ బంధం మరింత మెరుగుపడిందని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.