పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని అమెరికా ఖండించింది. ఇకనైనా దేశంలో ఉన్న ఉగ్రవాదులను వారి స్థావరాలను ధ్వంసం చేయాలని పాకిస్థాన్కు సూచించింది.
‘పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదులను అంతంచేసి ఆ దేశంలో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేయాలి’ అని స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి అన్నారు.
తీవ్రవాదులు పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతూ పొరుగు దేశం (ఇండియా)పై దాడులు చేస్తోందని కిర్బి వ్యాఖ్యానించారు.
తమ గడ్డపై తీవ్రవాదాన్ని అణిచివేస్తేనే శాంతి స్థాపన సాధ్యమవుతుందని సూచించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ భారీ ఆందోళనకు ఇచ్చిన పిలుపుపై స్పందించిన ఆయన..ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పస్టం చేశారు.
‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. శాంతియుత నిరసనకు సంఘీభావం ఉంటుంది. కానీ ఇది ఆ దేశంలోని అంతర్గత వ్యవహారం కాబట్టి..దీనిపై ఇంతకు మించి ఏమీ మాట్లాడలేం’ అని కిర్బి పేర్కొన్నారు.
‘పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదులను అంతంచేసి ఆ దేశంలో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేయాలి’ అని స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి అన్నారు.
తీవ్రవాదులు పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతూ పొరుగు దేశం (ఇండియా)పై దాడులు చేస్తోందని కిర్బి వ్యాఖ్యానించారు.
తమ గడ్డపై తీవ్రవాదాన్ని అణిచివేస్తేనే శాంతి స్థాపన సాధ్యమవుతుందని సూచించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ భారీ ఆందోళనకు ఇచ్చిన పిలుపుపై స్పందించిన ఆయన..ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పస్టం చేశారు.
‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. శాంతియుత నిరసనకు సంఘీభావం ఉంటుంది. కానీ ఇది ఆ దేశంలోని అంతర్గత వ్యవహారం కాబట్టి..దీనిపై ఇంతకు మించి ఏమీ మాట్లాడలేం’ అని కిర్బి పేర్కొన్నారు.