యాప్నగరం

వీవీఐపీలకు షాకిస్తూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ కీలక నిర్ణయాలు

పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఇకపై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచిస్తూ.. తాజాగా పలు ఆంక్షలు విధించారు.

Samayam Telugu 25 Aug 2018, 9:09 pm
పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఇకపై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచిస్తూ.. తాజాగా పలు ఆంక్షలు విధించారు. ప్రధాని, అధ్యక్షుడు, చీఫ్ జస్టీస్‌తో సహా ప్రభుత్వ అధికారులు ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో విమాన ప్రయాణాలు చేయరాదని, కేవలం బిజినెస్ క్లాస్‌ లేదా క్లబ్‌ క్లాస్‌లలో మాత్రమే ప్రయాణించాలని ఆదేశించారు.
Samayam Telugu imran_khan_1515326011_725x725


ఇమ్రాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరీ వెల్లడించారు. దేశ, విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు వినియోగించరాదని నిర్ణయించారు. ప్రభుత్వ నిధులు ఇష్టానుసారం దుర్వినియోగం కాకుండా కళ్లేం వేసే లక్ష్యంతో ఇమ్రాన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒకే ఏడాదిలో రూ.5,100 కోట్లు నిధులను దుర్వినియోగం చేశారని, అందుకే ఇమ్రాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఫవాద్‌ చౌదరీ తెలిపారు. ఇమ్రాన్ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే కీలక నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. ప్రధానికి కేటాయించే అధికారిక బంగ్లాలో కాకుండా మిలటరీ సెక్రటరీ నివాసంలోని చిన్న పోర్షన్‌లో ఉంటున్నారు. ఏది ఏమైనా ఇమ్రాన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూల స్పందనే వ్యక్తమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.