యాప్నగరం

​ ఎర్రకోట మాదే: పక్కదేశంలో పాకిస్థాన్ గొప్పలు

తమదేశంలోనే కాదు పక్క దేశాలకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ గొప్పలకు పోవడం మానడం లేదని మరోసారి రుజువైంది.

TNN 15 Jun 2017, 10:37 am
తమదేశంలోనే కాదు పక్క దేశాలకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ గొప్పలకు పోవడం మానడం లేదని మరోసారి రుజువైంది. షాంగై కోఆపరేషన్ ఆర్గనేషన్ సభ్యుల సమావేశంలో ఎర్రకోట తమదేశంలో ఉందని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఫొటోను చూపించింది. ఎర్రకోటపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాన్ని కూడా గమనించకుండడా ఈ కోట తమదేనని పాకిస్థాన్ చెప్పుకోవడంతో అడ్డంగా దొరికిపోయింది.
Samayam Telugu pakistan claims red fort in its history at seo
​ ఎర్రకోట మాదే: పక్కదేశంలో పాకిస్థాన్ గొప్పలు


ఎస్ఈవోలోని సభ్యులైన ఎనిమిది దేశాల్లో భారత్, పాకిస్థాన్ లకు ఈసారి సభ్యత్వం లభించింది. ఇందులో ఇప్పటికే చైనా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ లు ఉన్నాయి. ఎస్ఈవో సభ్య దేశాలన్ని పాల్గొన్న ఎగ్జిబిషన్ లో పాకిస్థాన్ ఎర్రకోట గురించి వర్ణించింది. ‘మొఘలుల కాలంలో వారి మేధోసంపత్తికి ఈ నిర్మాణాలు నిదర్శనం’ అంటూ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న ఎర్రకోట ఫొటోను చూపిస్తూ ‘ఇది లాహోర్ లోని షాలిమార్ గార్డెన్స్ లో ఉంది’ అని చెప్పుకుంది.

మొఘలుల తొలి పరిపాలకుడు బాబర్ గురించి, మొఘలుల సామ్రాజ్యం గురించి ఎస్ఈవో సభ్యదేశాలు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపించాయి.

ఇటు భారత్ సైతం ఎర్రకోట, తాజ్ మహల్ లను తమ దేశ చారిత్రక సంపదగా పేర్కొంది. 1631-1648 మధ్యకాలంలో షాజహాన్ తన భార్య ముంతాజ్ కు కానుగా నిర్మించిన తాజ్ మహల్ గొప్పతనాన్ని వర్ణించింది.

ఇతర సభ్యదేశాలు సైతం తమ దేశాల్లోని వారసత్వ, చారిత్రక సంపద గురించి వివరించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.