యాప్నగరం

భారత్‌ దుస్సాహసం చేస్తే మేము చూస్తూ కూర్చుంటామా: పాక్!

పాకిస్థాన్ పాలకుల వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఓ వైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం దాడులకు పాల్పడుతుంటే, పాలకులు సైతం నోరుపారేసుకుంటున్నారు.

Samayam Telugu 6 Feb 2018, 3:18 pm
పాకిస్థాన్ పాలకుల వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఓ వైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం దాడులకు పాల్పడుతుంటే, పాలకులు సైతం నోరుపారేసుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ భారత్‌ను హెచ్చరించడం గమనార్హం. భారత్ దుస్సాహసానికి పూనుకుంటే తమ వైపు నుంచి కూడా ప్రతిస్పందన అంతే దీటుగా ఉంటుందని హెచ్చరించాడు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్‌లోని పాక్ అధ్యక్ష భవనం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో దస్తగిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘దుస్సాహసం చేసే హక్కు వారికి (భారత్) ఉంటే, దీనికి ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది... అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుందనేది మాకు సంబంధించిన అంశం’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
Samayam Telugu pakistan defence minister warns india against any misadventure
భారత్‌ దుస్సాహసం చేస్తే మేము చూస్తూ కూర్చుంటామా: పాక్!


అంతేకాదు 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని, కానీ, ఒకవేళ యుద్ధం అనివార్యమైన సమయంలో దీన్ని స్పందించలేని బలహీనతగా చూడొద్దని పేర్కొన్నారు. కశ్మీర్‌లో మానవత్వానికి వ్యతిరేకంగా భారత దళాలు నేరాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. కశ్మీర్‌లో భారత దళాలు సాగిస్తోన్న హింస, నేరాలపై అంతర్జాతీయస్థాయి విచారణ జరగాలని దస్తగిర్ డిమాండ్ చేశారు. ఇంకో కార్యక్రమంలో కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్ణయించే హక్కు మాకుందని, సరిహద్దుల్లో భారత దళాల ప్రతిస్పందన బట్టే వ్యవహరిస్తున్నామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.