పాక్ ఏర్పాటుకు మూలకారణమైన జిన్నా ఆశయాలను నెరవేర్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాక్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో 119 స్థానాల్లో జయకేతనం ఎగరవేసి ఆయన తిరుగులేని నేతగా అవతరించారు. ఫలితాల అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం బలపడుతుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శమని ఆయన అన్నారు. తాజా ఎన్నికలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించిన ఇమ్రాన్.. తన ప్రార్థనలకు ఈ రోజు సమాధానం దొరికిందని అన్నారు. పన్ను రూపాన్ని మార్చేస్తానని, చైనాతో బంధాలను మరింత పెంచుకుంటామని తెలిపారు. అఫ్గానిస్థాన్లో శాంతి కోసం కృషి చేస్తానని తెలిపారు. భారత్కు సంబంధించిన పలు అంశాలపై ఇమ్రాన్ తనదైన శైలిలో స్పందించారు.
1. అత్యంత ప్రధాన అంశం కశ్మీర్
‘అత్యంత కీలక ప్రాంతమైన కశ్మీర్.. ఇరు దేశాల మధ్య సున్నితమైన, అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారడం దురదృష్టకరం. గత 30 ఏళ్లుగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కశ్మీరీలను ఇండియన్ ఆర్మీ అణచివేస్తోంది. ఒకరిపై మరొకరు నిందారోపణలు, బ్లేమ్ గేమ్కు ఇక ఎంతమాత్రం తావులేదు. సమస్య పరిష్కారానికి భారత్, పాక్ కలిసి పనిచేయాల్సి ఉంది’ అని ఇమ్రాన్ అన్నారు.
2. భారత్తో సంబంధాలు..
పాక్తో సత్సంబంధాలకు భారత్లో నాయకత్వం సిద్ధంగా ఉంటే.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య సంబంధాలు బలోపేతమైతే అది కేవలం ఇరు దేశాల ప్రజలకు మాత్రమే లాభదాయకం కాదని.. యావత్ ఉపఖండానికే ప్రయోజనకరమని ఆయన అన్నారు.
‘ఇండియా ఒకడుగు ముందుకేస్తే.. మేం రెండడుగులు ముందుకు రావడానికి సిద్ధం. ప్రస్తుతం ఇది ఏకపక్షంగా మారింది. భారత్ అదేపనిగా పాక్ను నిందిస్తోంది’ అని ఇమ్రాన్ అన్నారు.
3. భారత్తో వాణిజ్యం
భారత్, పాకిస్థాన్ మధ్య సరైన వాణిజ్య సంబంధాలు ఉండాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఇమ్రాన్ అన్నారు. ఇది ఇరు దేశాలకే కాకుండా దక్షిణాసియాకే ఎంతో ప్రయోజనకరమని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఉపఖండంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే భారత్, పాక్ మధ్య మెరుగైన వాణిజ్య సంబధాలు ఉండాల్సిన అవసరముంది. ఒక పాకిస్థానీగా ఉపఖండంలో మంచి వాణిజ్య సంబంధాలు కోరుకుంటున్నా. భారత్, పాక్ మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు.
4. భారతీయ మీడియా తీరుతో బాధపడ్డా
భారతీయ మీడియా తనపై కథనాలు వెలువరించిన తీరు తననెంతో బాధించిందని ఇమ్రాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత మీడియా తనను బాలీవుడ్ విలన్గా చిత్రీకరించిందని ఆరోపించారు. హిందుస్థాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్న పాకీస్థానీయుల్లో తానొకడినని ఆయన వెల్లడించారు. కానీ, ఇమ్రాన్ వస్తే ఏదో నష్టం జరిగిపోతుందనట్లుగా భారత ప్రజల్లో భయం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
5. భారత్తో వ్యక్తిగత సంబంధాలు
భారత్లో అత్యధిక మందితో సత్సంబంధాలున్న అతికొద్ది పాకిస్థానీయుల్లో తానొకడినని ఇమ్రాన్ చెప్పారు. ‘క్రికెట్ నాకు భారత్లో ఎంతో మంది మిత్రులను అందించింది. భారత్, పాక్ కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరిక సమస్యను సమూలంగా తొలగించవచ్చు. ఇరు దేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీరే’ అని ఆయన అన్నారు.
పేదల బాధలు తీర్చడమే ప్రధాన ఎజెండా
22 ఏళ్ల పోరాటం అనంతరం తనకు ఈ అవకాశం దక్కిందని, పేదల బాధలు తీర్చడమే తన ప్రధాన ఎజెండా అని ఇమ్రాన్ అన్నారు. పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం బలపడేలా చేస్తానని స్పష్టం చేశారు. చైనా గత 30 ఏళ్లలో 70 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటపడేసిందని అయన తెలిపారు. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయటమనేది అపూర్వమైన అంశంగా పేర్కొన్నారు.
తమ పార్టీకి విజయం లభించిన నేపథ్యంలో దేవుడికి (అల్లా) కృతజ్ఞతలు చెబుతున్నానని ఇమ్రాన్ తెలిపారు. అనేక ఉగ్రవాద దాడుల వెనుక ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయిందన్న ఇమ్రాన్.. భద్రతా బలగాల సేవలకు ధన్యవాదాలు తెలిపారు.
1. అత్యంత ప్రధాన అంశం కశ్మీర్
‘అత్యంత కీలక ప్రాంతమైన కశ్మీర్.. ఇరు దేశాల మధ్య సున్నితమైన, అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారడం దురదృష్టకరం. గత 30 ఏళ్లుగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కశ్మీరీలను ఇండియన్ ఆర్మీ అణచివేస్తోంది. ఒకరిపై మరొకరు నిందారోపణలు, బ్లేమ్ గేమ్కు ఇక ఎంతమాత్రం తావులేదు. సమస్య పరిష్కారానికి భారత్, పాక్ కలిసి పనిచేయాల్సి ఉంది’ అని ఇమ్రాన్ అన్నారు.
2. భారత్తో సంబంధాలు..
పాక్తో సత్సంబంధాలకు భారత్లో నాయకత్వం సిద్ధంగా ఉంటే.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య సంబంధాలు బలోపేతమైతే అది కేవలం ఇరు దేశాల ప్రజలకు మాత్రమే లాభదాయకం కాదని.. యావత్ ఉపఖండానికే ప్రయోజనకరమని ఆయన అన్నారు.
‘ఇండియా ఒకడుగు ముందుకేస్తే.. మేం రెండడుగులు ముందుకు రావడానికి సిద్ధం. ప్రస్తుతం ఇది ఏకపక్షంగా మారింది. భారత్ అదేపనిగా పాక్ను నిందిస్తోంది’ అని ఇమ్రాన్ అన్నారు.
3. భారత్తో వాణిజ్యం
భారత్, పాకిస్థాన్ మధ్య సరైన వాణిజ్య సంబంధాలు ఉండాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఇమ్రాన్ అన్నారు. ఇది ఇరు దేశాలకే కాకుండా దక్షిణాసియాకే ఎంతో ప్రయోజనకరమని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఉపఖండంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే భారత్, పాక్ మధ్య మెరుగైన వాణిజ్య సంబధాలు ఉండాల్సిన అవసరముంది. ఒక పాకిస్థానీగా ఉపఖండంలో మంచి వాణిజ్య సంబంధాలు కోరుకుంటున్నా. భారత్, పాక్ మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు.
4. భారతీయ మీడియా తీరుతో బాధపడ్డా
భారతీయ మీడియా తనపై కథనాలు వెలువరించిన తీరు తననెంతో బాధించిందని ఇమ్రాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత మీడియా తనను బాలీవుడ్ విలన్గా చిత్రీకరించిందని ఆరోపించారు. హిందుస్థాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్న పాకీస్థానీయుల్లో తానొకడినని ఆయన వెల్లడించారు. కానీ, ఇమ్రాన్ వస్తే ఏదో నష్టం జరిగిపోతుందనట్లుగా భారత ప్రజల్లో భయం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
5. భారత్తో వ్యక్తిగత సంబంధాలు
భారత్లో అత్యధిక మందితో సత్సంబంధాలున్న అతికొద్ది పాకిస్థానీయుల్లో తానొకడినని ఇమ్రాన్ చెప్పారు. ‘క్రికెట్ నాకు భారత్లో ఎంతో మంది మిత్రులను అందించింది. భారత్, పాక్ కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరిక సమస్యను సమూలంగా తొలగించవచ్చు. ఇరు దేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీరే’ అని ఆయన అన్నారు.
పేదల బాధలు తీర్చడమే ప్రధాన ఎజెండా
22 ఏళ్ల పోరాటం అనంతరం తనకు ఈ అవకాశం దక్కిందని, పేదల బాధలు తీర్చడమే తన ప్రధాన ఎజెండా అని ఇమ్రాన్ అన్నారు. పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం బలపడేలా చేస్తానని స్పష్టం చేశారు. చైనా గత 30 ఏళ్లలో 70 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటపడేసిందని అయన తెలిపారు. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయటమనేది అపూర్వమైన అంశంగా పేర్కొన్నారు.
తమ పార్టీకి విజయం లభించిన నేపథ్యంలో దేవుడికి (అల్లా) కృతజ్ఞతలు చెబుతున్నానని ఇమ్రాన్ తెలిపారు. అనేక ఉగ్రవాద దాడుల వెనుక ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయిందన్న ఇమ్రాన్.. భద్రతా బలగాల సేవలకు ధన్యవాదాలు తెలిపారు.