యాప్నగరం

నిద్రపోయిన పైలట్...రిస్క్‌లో 300 మంది ప్రాణాలు!

300 మందితో లండన్ బయలుదేరిన విమానంలోని సీనియర్ పైలట్ బిజినెస్ క్లాస్‌లో రెండున్నర గంటలు నిద్రపోయిన ఘటన వెలుగు చూసింది.

TNN 7 May 2017, 7:08 pm
పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సీనియర్ పైలట్ 300 మంది ప్రయాణికులతో లండన్ విమానాన్ని ట్రెయినీకి అప్పగించి నిద్రపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇస్లామాబాద్ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 26 న పీకే- 785 విమానం 300 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత సీనియర్ పైలట్ కెప్టెన్ అమిర్ అక్తర్ హష్మీ బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో సుమారు రెండున్నర గంటలు నిద్రపోయినట్లు డాన్ పత్రిక వెల్లడించింది.
Samayam Telugu pakistan international airlines pilot sleeps on flight risks 300 lives
నిద్రపోయిన పైలట్...రిస్క్‌లో 300 మంది ప్రాణాలు!


పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ పైలట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడైన హష్మీపై బాధ్యతారాహిత్యం కింద చర్యలు ప్రారంభించినా పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గారని తెలిపిందిది. ప్రస్తుతం హష్మీ విధులకు దూరంగా ఉన్నాడు, దీనిపై దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇతర విషయాలను చెప్పడానికి సమయం కాదని పీఐఏ అధికార ప్రతినిధి దన్యాల్ గిలానీ పేర్కొన్నారు. శిక్షణలో ఉన్న మహ్మద్ అసద్ అలీ కాక్‌పీట్‌లో ఉన్నాడు. పైలట్ శిక్షణ ఇచ్చే హష్మీకి ప్రభుత్వం జీతం కింద నెలకు రూ.1 లక్ష చెల్లిస్తోందని, కానీ అతడు తన విధులు మరచి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించాడని డాన్ పత్రిక వ్యాఖ్యానించింది.

ఇస్లామాబాద్ నుంచి బయలుదేరిన విమానంలో 305 ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 293 మంది ఎకానమీ క్లాస్, 12 మంది క్లబ్ క్లాస్ ప్రయాణికులున్నట్లు తెలిపింది. విదేశీ పర్యటనపై నెల రోజుల పాటు నిషేధం ఉన్న ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రయాణానికి నిన్న ప్రత్యేకంగా అనుమతించిన పీఐఏ అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మంత్రి దగ్గర నుంచి రూ.కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూడటంతో పీఐఏ సీఈఓను విధులు నుంచి తప్పించారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రారంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.