యాప్నగరం

కుల్‌భూషణ్‌పై లాయర్ల సంచలన నిర్ణయం!

పాకిస్థాన్ లో ఉరిశిక్ష పడిన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ పై ఆ దేశ న్యాయవాదులు మరింత కటువుగా

TNN 14 Apr 2017, 5:15 pm
పాకిస్థాన్ లో ఉరిశిక్ష పడిన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ పై ఆ దేశ న్యాయవాదులు మరింత కటువుగా వ్యవహారించాలని నిర్ణయించారు. తమ దేశంలో గుఢాచర్యానికి పాల్పడ్డ జాదవ్ కు ఎట్టి పరిస్థితుల్లో న్యాయ సహాయం అందించరాదని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయించింది.
Samayam Telugu pakistan lawyers warned not to take indian jadhavs case
కుల్‌భూషణ్‌పై లాయర్ల సంచలన నిర్ణయం!


‘‘ఇండియన్ గూఢచారి కుల్ భూషణ్ కు ఎవరైనా న్యాయసేవలు అందిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయించింది’’ అని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమేర్ సయిద్ రాన్ శుక్రవారం వెల్లడించారు.

జాదవ్ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గరాదని, విదేశీ ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగరాదని బార్ అసోసియేషన్ సూచించింది.

‘జాదవ్ ను విడిపించడానికి అతని సొంతదేశమైన భారత్ పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. గుఢాచర్యంతో పాకిస్థాన్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న జాదవ్ ను ఉరితీయాల్సిందే’ అన అమేర్ సయిద్ డిమాండ్ చేశారు.

మరోవైపు పాకిస్థాన్ లో ఉన్న భారత హైకమీషనర్ గౌతమ్ బాంబవాలే పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శితో చర్చలు జరుపుతున్నారు. జాదవ్ విడుదల కోసం ఇండియా చేస్తోన్న విజ్ఞాపనలను పాకిస్థాన్ పక్కనబెట్టిందని సమాచారం. అయితే పాకిస్థాన్ చట్టాల ఆధారంగానే జాదవ్ కుటుంబంతో కూడా అప్పీల్ చేయాలని భారత్ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.