యాప్నగరం

ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆగ్రహం.. కారణం ఇదే!

మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేశారని ఫ్రాన్స్‌లో చార్లెస్ హేబ్దో పత్రికపై దాడులు చేసి, మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. 2015 ఈ ఘటన జరిగ్గా.. మరోసారి అటువంటి వివాదమే ఫ్రాన్స్‌లో చెలరేగింది.

Samayam Telugu 26 Oct 2020, 11:44 am
మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ల వివాదంలో ఓ ఉపాధ్యాయుని పారిస్‌లో గతవారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇస్లాంవాదులపై విమర్శలు గుప్పించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మహమ్మద్ ప్రవక్త‌పై వేసిన కార్టూన్లను సమర్ధించారు. అక్టోబరు 16న భావ ప్రకటన స్వేచ్ఛ పాఠాన్ని బోధిస్తుండగా మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను మహిళా టీచర్ శామ్యూల్ ప్యాటీ ప్రదర్శించారు. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు.
Samayam Telugu ఫ్రెంచ్ అధ్యక్షుడిపై ఇమ్రాన్ దాడి


ఇస్లాంవాదులు ఉపాధ్యాయునిని హత్య చేశారు.. ఎందుకంటే వారు మన భవిష్యత్తును కోరుకుంటున్నారని మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. పరిస్థితులను అదుపులో పెట్టాల్సింది పోయి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఇమ్రాన్ ధ్వజమెత్తారు. ఇటువంటి కామెంట్ల ద్వారా అతివాదులకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

‘హింసకు పాల్పడే ఉగ్రవాదుల కంటే ఇస్లాంపై దాడిచేసి ఇస్లామోఫోబియాను మెక్రాన్ ప్రోత్సహించడం దురదృష్టకరం.. అది ముస్లింల పట్ల శ్వేతజాతీయుల ఆధిపత్యం లేదా నాజీ భావజాలం కావచ్చు’ అని ఇమ్రాన్ ఆరోపించారు. అయితే, మెక్రాన్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం సంక్షోభానికి ఇస్లాం కారణమవుతోందని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

ఉపాధ్యాయుని హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు నివాళులర్పించడానికి మాంట్ పెల్లియర్, టులౌస్‌లో ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను ప్రొజెక్టర్ల సాయంతో ప్రదర్శిస్తున్నారు. దీని రక్షణగా పోలీసులను మోహరించారు. మహమ్మద్ ప్రవక్త, జీసస్, ఇతర మతాలకు చెందిన దేవతల కార్టూన్లు కూడా హోటళ్లలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతో హత్యకు గురైన టీచర్ శామ్యూల్ ఫ్యాటీకి నివాళులర్పించినట్టు ఒసిటెనీ రాష్ట్ర అధ్యక్షుడు కారోల్ డెల్గా ప్రకటించారు.

శామ్యూల్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇటువంటి కార్టూన్లు ఫ్రాన్స్‌లో కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఫ్రాన్స్ భవిష్యత్తుపై ఇస్లామిక్ మత వాదులు కన్నేయడంతోనే శామ్యూల్ ప్యాటీ మరణించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.