యాప్నగరం

కుల్‌భూషణ్ క్షమాభిక్ష కోరవచ్చు: పాకిస్థాన్

గుఢాచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఉరిశిక్ష విధించిన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ క్షమాభిక్ష కోరవచ్చిన

TNN 14 Apr 2017, 6:06 pm
గుఢాచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఉరిశిక్ష విధించిన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ క్షమాభిక్ష కోరవచ్చిన పాకిస్థాన్ పేర్కొంది. ఉరిశిక్ష ఖరారైన 40రోజుల్లోగా అప్పిలేట్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఆ దేశ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు.
Samayam Telugu pakistan says kulbhushan may appeal for mercy on his death sentence
కుల్‌భూషణ్ క్షమాభిక్ష కోరవచ్చు: పాకిస్థాన్


‘‘చట్టం ప్రకారం కుల్ భూషణ్ కు వివిధ ఆఫ్షన్లు ఉన్నాయి. 40 రోజుల్లోగా అప్పిలేట్ కోర్టులో అప్పీలు చేసుకునే హక్కు అతనికుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు కూడా 60 రోజుల్లోగా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆర్మీ స్టాఫ్ కు అప్పీల్ చేసుకునేది అప్పిలేట్ కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని సర్తాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్మీ స్టాఫ్ అనుమతిస్తే జాదవ్ పాకిస్థాన్ అధ్యక్షుడి (రాష్ట్రపతి)కి కూడా క్షమాభిక్ష కోరుతూ విన్నవించుకోవచ్చని సర్తాజ్ పేర్కొన్నారు.

46ఏళ్ల రిటైర్డ్ నేవీ అధికారి కుల్ భూషణ్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ, తమ దేశంలో గుఢాచర్యానికి పాల్పడుతున్నాయని పాకిస్థాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. జాదవ్ హిందూ, ముస్లింల పేరిట రెండు పాస్ పోర్టులు కూడా కల్గి ఉన్నాడని, ఇదే విషయాన్న జనవరిలోనే ఇండియాకు సమాచారం ఇచ్చినా ఏలాంటి స్పందన లేదని పాక్ చెబుతోంది.

జాదవ్ అమాయకుడని అతణ్ని విడుదల చేయాలని భారత్ దౌత్యం నెరపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.