తమ దేశంలోని థియేటర్లలో భారతీయ సినిమాలపై విధించిన నిషేదాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఎత్తివేసింది. గత నాలుగు నెలలుగా పాకిస్థాన్ లో ఇండియన్ సినిమాలు ఆడటం లేదు.
కశ్మీర్ లోని ఉరీ ఆర్మీ క్యాంపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18మంది సైనికులను చంపారు. ఈ దాడిని భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటీనటులు ఖండించ లేదని...బాలీవుడ్ వర్గాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం పాక్ నటీనటులను సినిమాల్లో నటించకుండా వారిపై నిషేదం విధిస్తూ కొన్ని నిర్మాణ సంస్థలు ‘ఫత్వా’జారీ చేశాయి. దీంతో సమాధానంగా ఇండియన్ సినిమాలు తమ దేశంలోని థియేటర్లలో ఆడటానికి వీల్లేదని పాకిస్థాన్ నిషేదం విధించింది.
అయితే బాలీవుడ్ సినిమాలు నాలుగు నెలలుగా ఆడకపోవడంతో పాకిస్థాన్ థియేటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. పాకిస్థాన్ థియేటర్లకు వచ్చే అత్యధిక ఆదాయం ఇండియన్ హిందీ చిత్రాల నుంచే.
ఇండియన్ సినిమాలపై నిషేదం తొలిగించిన పాకిస్థాన్ ప్రభుత్వం...థియేటర్ల యజమానులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై చర్చించేందుకు ప్రధాని నవాజ్ షరీప్ ఒక కమిటీని నియమించారు.
‘‘మాకు హాలీవుడ్, బాలీవుడ్ ల నుంచే 70శాతం ఆదాయం వస్తుంది. ప్రస్తుతం విధించిన తాత్కాలిక నిషేదం వల్ల మేం నెట్టుకురాగలం. కానీ ఇదే పరిస్థితి ధీర్ఘకాలంలో కొనసాగితే మాత్రం మేం థియేటర్లు మూసుకోవాల్సిందే’’నని కరాచీలోని ఆట్రియమ్ థియేట్ యజమాని నదీమ్ మంద్విల్లా ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.
కశ్మీర్ లోని ఉరీ ఆర్మీ క్యాంపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18మంది సైనికులను చంపారు. ఈ దాడిని భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటీనటులు ఖండించ లేదని...బాలీవుడ్ వర్గాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం పాక్ నటీనటులను సినిమాల్లో నటించకుండా వారిపై నిషేదం విధిస్తూ కొన్ని నిర్మాణ సంస్థలు ‘ఫత్వా’జారీ చేశాయి. దీంతో సమాధానంగా ఇండియన్ సినిమాలు తమ దేశంలోని థియేటర్లలో ఆడటానికి వీల్లేదని పాకిస్థాన్ నిషేదం విధించింది.
అయితే బాలీవుడ్ సినిమాలు నాలుగు నెలలుగా ఆడకపోవడంతో పాకిస్థాన్ థియేటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. పాకిస్థాన్ థియేటర్లకు వచ్చే అత్యధిక ఆదాయం ఇండియన్ హిందీ చిత్రాల నుంచే.
ఇండియన్ సినిమాలపై నిషేదం తొలిగించిన పాకిస్థాన్ ప్రభుత్వం...థియేటర్ల యజమానులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై చర్చించేందుకు ప్రధాని నవాజ్ షరీప్ ఒక కమిటీని నియమించారు.
‘‘మాకు హాలీవుడ్, బాలీవుడ్ ల నుంచే 70శాతం ఆదాయం వస్తుంది. ప్రస్తుతం విధించిన తాత్కాలిక నిషేదం వల్ల మేం నెట్టుకురాగలం. కానీ ఇదే పరిస్థితి ధీర్ఘకాలంలో కొనసాగితే మాత్రం మేం థియేటర్లు మూసుకోవాల్సిందే’’నని కరాచీలోని ఆట్రియమ్ థియేట్ యజమాని నదీమ్ మంద్విల్లా ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.