యాప్నగరం

హృదయానికి హత్తుకునేలా.. మోదీకి పాక్ బాలిక లేఖ

యూపీ విజయంతో తాజాగా పాకిస్థాన్‌కు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రధాని మోదీని అభినందిస్తూ లేఖ రాసింది. ఆ లేఖలో ఇంకేం విషయాలు ఉన్నాయంటే..

TNN 15 Mar 2017, 12:59 pm
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టిన ప్రధాని మోదీపై అంతర్జాతీయంగానూ ప్రశంసల జల్లు కురుస్తోంది. తిరుగులేని శక్తిగా అవతరించారని ప్రపంచ మీడియా మోదీని ఆకాశానికి ఎత్తేస్తోంది. యూపీ విజయంతో తాజాగా పాకిస్థాన్‌కు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రధాని మోదీని అభినందిస్తూ లేఖ రాసింది. ఇకపై మీరు భారత్, పాకిస్థానీయుల హృదయాలను గెలవడంపై మరింత దృష్టి సారించాలని ఆ అమ్మాయి మోదీని కోరింది. మీరు ఇరు దేశాల మధ్య శాంతి వారధి కావాలంటూ ఆకాంక్షించింది.
Samayam Telugu pakistani girl congratulates pm modi for up victory calls for turning focus on peace
హృదయానికి హత్తుకునేలా.. మోదీకి పాక్ బాలిక లేఖ


రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడాల్సిన ఆవశ్యకతను అఖీదత్ నవీద్ అనే తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది. ప్రజల హృదయాలను గెలవడం అనేది నిజంగా అద్భుతమని గతంలో మా నాన్న చెప్పారు. యూపీలో విజయంతో మీరు ఆ పని చేశారు. మరింత మంది భారతీయుల, పాకిస్థానీయుల హృదయాలను గెలవాలంటే మాత్రం ఇరు దేశాల మధ్య స్నేహభావం పెంచడానికి, శాంతి కోసం మీరు కృషి చేయాలి అని ఆ చిన్నారి ప్రధానికి సలహా ఇచ్చింది.


రెండు దేశాల మధ్య చక్కటి అనుంబంధం కొనసాగడం అవసరం. మనం బుల్లెట్లు కొనొద్దు, బుక్స్ కొనాలి.. మనం తుపాకులు కొనొద్దు, పేదలకు మందులు కొనాలి అంటూ ఆ బాలిక మనసును హత్తుకునేలా మోదీకి లేఖ రాసింది. సగటు పాకిస్థానీ మనోగతాన్ని తన లేఖ ద్వారా బయటపెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.