యాప్నగరం

పాక్ కాల్పుల్లో భారత జవాను వీరమరణం

ఉరీ ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ ప్రతి రోజు కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వతోంది.

TNN 6 Nov 2016, 11:17 am
జమ్ముకశ్మీర్ లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉరీ ఘటన అనంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ యథేచ్ఛగా ఉల్లఘిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ హద్దుమీరి ప్రవర్తించింది. పూంచ్ జిల్లాలోని కేజీ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పలు జరిపి.. ఓ భారత జవాన్ ను పొట్టనపెట్టుకున్నారు. పాక్ రేంజర్లు దొడ్డిదారిన జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను పోరాడి అమరుడయ్యాడు. కాగా పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది.
Samayam Telugu pakistani troops again violate ceasefire one indian soldier killed
పాక్ కాల్పుల్లో భారత జవాను వీరమరణం


ఉరీ ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ ప్రతి రోజు కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వతోంది. ఈ పోరులో భారత సైన్యం.. 20 మంది పాక్ సైనికులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తో ప్రత్యక్షంగా పోరాడలేక.. పాక్ ఇలా దొడ్డిదారిన కాల్పులు జరుపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.