యాప్నగరం

ఫిలిప్పైన్స్‌పై విరుచుకుపడ్డ తుపాను: 182 మంది మృతి

టెంబిన్ తుపాన్ విలయతాండవంతో ఫిలిప్పైన్స్ చిగురుటాకులా వణికిపోతుంది. కిస్మస్ ముందు తుపాను విరుచుకుపడటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

TNN 24 Dec 2017, 9:11 am
ఫిలిప్పైన్స్‌‌లో టెంబిన్ తుపాను విలయతాండవం చేస్తోంది. దక్షిణ ఫిలిప్పైన్స్ టెంబిన్‌ విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. వరద దాటికి నదిలో కొట్టుకుపోతున్న డజన్ల కొద్దీ మృతదేహాలను సహాయక సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. నదిలో కొట్టుకుపోతున్న బోటును కాపాడుకునే క్రమంలో మొసలికి చిక్కి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లానాడెల్ నోర్టే, లానోడెల్ సూర్, జంబోగా ద్వీపంలో అత్యధికంగా మృత్యువాత పడినట్లు పిలిప్పైన్స్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రోమినా మారాసిగాన్ తెలిపారు. పిలిప్పీన్స్‌లో రెండో అతిపెద్ద ద్వీపమైన మిందానోవాలో నివసిస్తున్న రెండు కోట్ల మంది తుఫాను కారణంగా అగచాట్లు పడుతున్నారు. బీదలు ఎక్కువగా ఉండే జామ్‌బోవాంగా ద్వీపకల్పంలో వరదల ఉద్ధృతికి సమీప సాల్వడోర్‌ నదిలో అనేకమంది కొట్టుకుపోయారు.
Samayam Telugu philippines tropical storm 182 killed in flooding and landslides
ఫిలిప్పైన్స్‌పై విరుచుకుపడ్డ తుపాను: 182 మంది మృతి


క్రిస్మస్‌ ముందు తీవ్ర తుపాను విరుచుకుపడటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పరిస్థితులు అదుపులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్వచ్ఛంద సంస్థలు, సైనికులు సమన్వయంతో పనిచేస్తే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని సహాయక పునరావస శిబిరాలకు తరిలించారు. తుపాను వల్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో తీరం ప్రాంతాల్లోని అనేక నివాసాలు దెబ్బతిన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.