విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమవారం రాత్రి అమెరికాకు పయనమయ్యారు. ఈ పర్యటనలో భారత ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్నారు. గత రెండేళ్ల వ్యవధిలో నరేంద్ర మోడీ ..ఒబామాను కలవడం ఇది ఆరోసారి కావడం విశేషం. కాగా ఒబామాతో భేటీ అనంతరం అమెరికా కాంగ్రెస్ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసగించనున్నారు. తన అమెరికా పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...అంతకుమందు సోమవారం ఉదయం స్విస్ అధ్యక్షుడితో సమావేశమైన మోడీ స్విస్ బ్యాంకులో దాచుకున్న భాకతీయుల నల్లధనంపై చర్చించారు. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో భారత్ చేర్చేందుకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం జెనీవాలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.ఆ తర్వాత సోమవారం రాత్రి ప్రధాని మోడీ ఆమెరికా పయనమయ్యారు.
ముగిసిన స్విస్ పర్యటన..అమెరికా పయనం
ప్రధాని మోడీ విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.
TNN 6 Jun 2016, 10:23 pm