యాప్నగరం

ప్రధాని మోదీకి పాలస్తీనా అత్యున్నత పురస్కారం

పాలస్తీనా అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా ఘనత వహించిన నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యుతన్న పురస్కారం అందజేసింది.

TNN 10 Feb 2018, 4:13 pm
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాల్తసీనా’ను ప్రదానం చేశారు. భారత్, పాలస్తీనా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికిగానూ మోదీకి ఈ పురస్కారం అందజేసినట్లు అబ్బాస్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రిని పెంపొందించడానికి మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అబ్బాస్ తెలిపారు. స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తించి తమ దేశ ప్రజలకు మద్దతుగా నిలిచారని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కృషి చేశారని మోదీని అబ్బాస్ అభినందించారు.
Samayam Telugu pm modi conferred grand collar of the state of palestine
ప్రధాని మోదీకి పాలస్తీనా అత్యున్నత పురస్కారం


పాలస్తీనా అందజేసే అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కాలర్‌‌ను విదేశీ రాజులు, దేశాల అధినేతలకు మాత్రమే ప్రదానం చేస్తారు. గతంలో సౌదీ అరేబియా రాజు సల్మాన్, బహ్రెయిన్ కింగ్ హమద్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులు ఈ పురస్కారాన్ని పొందారు.

ఇటీవలే జెరూసలేం విషయంలో భారత్ పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ.. ఇండియా మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా వెళ్లడం ద్వారా.. ఆ దేశంలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా ఘనత వహించారు. గత రాత్రి జోర్డాన్ చేరకున్న ఆయన ఉదయాన్నే చాపర్ ద్వారా పాలస్తీనాలోని రామల్లా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ చాపర్లు భద్రత కల్పించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.