యాప్నగరం

టర్కీని కుదిపేసిన శక్తివంతమైన భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం.. సునామీ ముప్పు

టర్కీ, సిరియా సరిహద్దుల్లో నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. తర్వాత 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 6 Feb 2023, 10:05 am
టర్కీని సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదయ్యింది. అనంతరం 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గజియాన్‌టెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు తెలిపింది. 17.9 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అలాగే, నిమిషాల వ్యవధిలోనే మధ్య టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతులో రెండో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే వివరించింది.
Samayam Telugu Turkey Earthquake



భూకంపం ధాటికి అనేక భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. అయితే, ఆస్తి, ప్రాణనష్టం గురించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అయితే, భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. భూకంపం తర్వాత భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులు ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీయడం ఈ వీడియోల్లో కనబడుతోంది. ఇప్పటి వరకూ కనీసం 53 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని, అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు.


అలాగే, భవనాలు, ఇళ్లు కూడా పెద్ద సంఖ్యలో కూలిపోయాయని చెప్పారు. భూకంప ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దక్షిణ టర్కీ నగరం కఖ్రామాన్మరాస్ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు జర్మన్ రిసెర్చ ఫర్ జియోసైన్సెస్ చెప్పింది. సునామీ ముప్పుపై పరిశీలన చేస్తున్నామని తెలిపింది. గజియాన్‌టెప్‌తో పాటు చుట్టుపక్కల ఉన్ మల్త్యా, దియార్బాకిర్ ప్రావిన్సుల్లోనూ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. అటు, సరిహద్దుల్లోని లెబనా, సిరియాలోనూ భూకంప వల్ల పలువురు చనిపోయారు. సిరియాలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.


Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.