యాప్నగరం

కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రతిపాదన సిద్ధం: పాక్ మంత్రి

కశ్మీర్ వివాదం పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ మానవవనరుల శాఖ మంత్రి షరీన్ మజారీ వ్యాఖ్యానించారు. అంతేకాదు శక్తివంతమైన సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ఆమె తెలిపారు.

Samayam Telugu 29 Aug 2018, 12:03 pm
కశ్మీర్ వివాదం పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ మానవవనరుల శాఖ మంత్రి షరీన్ మజారీ వ్యాఖ్యానించారు. అంతేకాదు శక్తివంతమైన సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ఆమె తెలిపారు. రక్షణ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తోన్న షరీన్ మజారీ ఓ వారంలో తన ప్రతిపాదనలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సమర్పించనుంది. రెండు రోజుల కిందట ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన షరీన్ ప్రతిపాదనల గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఓ నమూనా రూపొదించి, ఆ దిశగా పనిచేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ ప్రతిపాదనలను ప్రధానితోపాటు క్యాబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులకు అందజేస్తామని, ఒకవేళ ముసాయిదాను ఆమోదం పొందితే తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తామని షరీన్ వెల్లడించారు.
Samayam Telugu షరీన్ మజారీ


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజీక్ స్టడీస్ డైరెక్టర్ జనరల్‌ అయిన షరీన్‌కు రక్షణ, భద్రత విషయాలపై అవగాహన ఉంది. ఇస్లామాబాద్‌లోని ఖైదే అజమ్ యూనివర్సిటీ డిఫెన్స్, స్ట్రాటజీక్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. ఈ అవగాహనతోనే షరీన్ చేసిన ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్, అమెరికా సంబంధాల విషయంలో సైన్యం ప్రాముఖ్యత గురించి మజారీ వెల్లడించిన తర్వాత ఆమె ప్రతిపాదనల్లో సైన్యం పాత్ర బలంగా ఉంటుందని నమ్ముతున్నానని రాజకీయ విశ్లేషకుడు ఔరంగజేబు ఖాన్ తెలిపారు. కశ్మీర్‌ అంశంతోపాటు భారత్‌తో ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతవారం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.