China Protests కరోనా మహమ్మారి నియంత్రణకు చైనా అవలంభిస్తోన్న జీరో కోవిడ్ విధానంపై అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడక్కడ జనాలు రోడ్లమీదకు వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. కఠిన కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కరోనా ఆంక్షలపై షింజియాంగ్ ప్రావిన్సుల (Xinjiang) ప్రజలు శనివారం భగ్గుమన్నారు. రాజధాని నగరం ఉర్ముచీ (Urumqi)లో వీధుల్లోకి భారీగా వచ్చిన పౌరులు.. కొవిడ్ లాక్డౌన్ను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. గురువారం రాత్రి ఉర్ముచీలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి దాదాపు 10 మంది సజీవదహనం కావడానికి కరోనా ఆంక్షల కారణమని ఆరోపిస్తూ ఈ ఆందోళనకు దిగారు. కఠిన ఆంక్షల వల్ల బయటకు రాలేకపోవడంతో అగ్నికి ఆహుతయ్యారని ఆరోపణలు రావడం.. పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
పెద్దఎత్తున బారికేడ్లను దాటి.. వీధుల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు చేపట్టిన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్.. షీ జిన్పింగ్ పదవిలో నుంచి దిగిపోతేనే ఉర్ముచీకి స్వేచ్ఛ’’ అని చైనా అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకెలాంటి ఆరోగ్య కోడ్లు అక్కర్లేదు.. మాకు స్వేచ్ఛ కావాలి అని గొంతెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.
అయితే, ఈ ఆరోపణలను ఖండించిన అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను దశలవారీగా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన ఉర్ముచీ నగరం.. చైనా ఆర్దిక రాజధానిగా గుర్తింపు పొందింది. అక్కడ ఆగస్టు నుంచి కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు 100 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఇప్పటికీ కఠిన లాక్డౌన్, క్వారంటైన్ నిబంధనలు అమలవుతున్నాయి. కొవిడ్ ఆంక్షల కారణంగా ఇటీవల ఇద్దరు చిన్నారులకు సకాలంలో వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలోనూ చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. నెలల తరబడి ఇళ్లకు పరిమితం కావడం మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా ఆంక్షలతో విసుగెత్తిన యాపిల్ ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున విధులు బహిష్కరించారు. అనంతరం బయటకొచ్చి నిరసనకు దిగారు.
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా చైనా పాలకులు మాత్రం తమ జీరో కోవిడ్ విధానాన్ని సమర్దించుకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకుని, ఆరోగ్య వ్యవస్థలపై పెను భారం పడకుండా ఉండాలంటే ఇదే ఉత్తమైన మార్గమని చెబుతున్నారు.
Read Latest International News And Telugu News
పెద్దఎత్తున బారికేడ్లను దాటి.. వీధుల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు చేపట్టిన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్.. షీ జిన్పింగ్ పదవిలో నుంచి దిగిపోతేనే ఉర్ముచీకి స్వేచ్ఛ’’ అని చైనా అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకెలాంటి ఆరోగ్య కోడ్లు అక్కర్లేదు.. మాకు స్వేచ్ఛ కావాలి అని గొంతెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.
అయితే, ఈ ఆరోపణలను ఖండించిన అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను దశలవారీగా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన ఉర్ముచీ నగరం.. చైనా ఆర్దిక రాజధానిగా గుర్తింపు పొందింది. అక్కడ ఆగస్టు నుంచి కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు 100 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనాలో పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఇప్పటికీ కఠిన లాక్డౌన్, క్వారంటైన్ నిబంధనలు అమలవుతున్నాయి. కొవిడ్ ఆంక్షల కారణంగా ఇటీవల ఇద్దరు చిన్నారులకు సకాలంలో వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలోనూ చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. నెలల తరబడి ఇళ్లకు పరిమితం కావడం మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా ఆంక్షలతో విసుగెత్తిన యాపిల్ ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున విధులు బహిష్కరించారు. అనంతరం బయటకొచ్చి నిరసనకు దిగారు.
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా చైనా పాలకులు మాత్రం తమ జీరో కోవిడ్ విధానాన్ని సమర్దించుకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకుని, ఆరోగ్య వ్యవస్థలపై పెను భారం పడకుండా ఉండాలంటే ఇదే ఉత్తమైన మార్గమని చెబుతున్నారు.
Read Latest International News And Telugu News