యాప్నగరం

Queen Elizabeth II: వేలానికి క్వీన్ ఎలిజబెత్ వాడిన టీ బ్యాగ్... ఎంతకు కొన్నారో తెలుసా..?

బ్రిటన్‌ను ఏడు దశాబ్దాలు పాలించిన క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth II) 96 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఆమె వాడిన వస్తువులను అమ్మకానికి పెడుతున్నారు. ఆమె వస్తువులు లక్షలు పెట్టి సొంతం చేసుకుంటున్నారు. ఆమె 1998లో వాడిన ఓ టీ బ్యాగ్‌ను ఒకరు లక్షలాది రూపాయలు పోసి మరీ తీసుకున్నారు. కాగా క్వీన్ ఎలిజబెత్ రాణి.. అంత్యక్రియలను ఇంకా నిర్వహించలేదు. సెప్టెంబర్ 19న లండన్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 10 Sep 2022, 8:12 pm
Queen Elizabeth II: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయింది. దిగ్విజయంగా 70 ఏళ్లు బ్రిటన్‌ను పాలించిన ఆమె 96 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. అయితే క్వీన్ ఎలిజబెత్-2 మృతితో ఆమె వాడిన వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చాయి. ఇందులో రాణి 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ అనూహ్యమైన ధరకు అమ్ముడైంది.
Samayam Telugu Queen Elizabeth II


క్వీన్ ఎలిజబెత్‌కు చెందిన టీ బ్యాగ్‌ని.. అమ్మకానికి పెడుతూ "చరిత్రలోని ఒక ముఖ్యమైన దాన్ని సొంతం చేసుకోండి. ఇది వెలకట్టలేనిది." అని లిస్టింగ్ లో పేర్కొన్నారు. అది 12 వేల డాలర్లకు సేల్ అయింది. అంటే మన కరెన్సీలో అక్షరాల 9.5 లక్షల రూపాయలు. ఈ టీ బ్యాగ్‌ని ఈబేలో వేలానికి పెట్టగా.. ఇలా లక్షలు పెట్టి కొనేశారు. అయితే ఈ టీ బ్యాగ్‌కు రాయల్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది. అంతేకాదు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సర్టిఫికెట్‌ని దీనికి జోడించారు.

ఈ టీ బ్యాగ్‌తో పాటు క్వీన్ ఎలిజబెత్- 2 జీవిత పరిమాణ మైనపు విగ్రహం కూడా ఈబేలో అమ్మకానికి పెట్టారు. దానిని15,900 డాలర్లుగా (రూ.12.6 లక్షలు) పేర్కొన్నారు. ఇంకా క్వీన్ బార్బీ బొమ్మ వంటివి ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.


చరిత్రలో ప్రత్యేక స్థానం...
బ్రిటన్ చరిత్రలో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమె ఏప్రిల్ 21న, 1926లో లండన్‌లో జన్మనించారు. గ్రీస్‌ యువరాజు, నేవీ లెఫ్టినెంట్‌ ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. నిజానికి ఎలిజబెత్ 1952, ఫిబ్రవరి 6న అయిష్టంగానే రాణి అయ్యారు. తన హయాంలోనే 25 దేశాలకు స్వతంత్రం ఇచ్చారు. ఈమె పాలనలో 15 మంది ప్రధానులుగా పనిచేశారు. ఏడు దశాబ్దాలుగా ఆమె పాలించడంతో.. ఆమెకో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఇంకా నిర్వహించలేదు. సెప్టెంబర్ 19న జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ అంత్యక్రియలకు దేశాధినేతలు కదలి వెళ్లనున్నారు.

Read Also:ఒక్క భార్యతోనే వేగలేకపోతుంటే...15 మందిని పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కాపురం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.