యాప్నగరం

జైలుపై భారీ దాడి: ఖైదీలు పరార్

దక్షిణ ఫిలీప్పీన్స్‌కు చెందిన జైలు నుంచి నూట యాభై మంది ఖైదీలు పరారయ్యారు.

TNN 4 Jan 2017, 3:47 pm
దక్షిణ ఫిలీప్పీన్స్‌కు చెందిన జైలు నుంచి నూట యాభై మంది ఖైదీలు పరారయ్యారు. మిందనావో ఐలాండ్ లోని నార్త్ కొటబాటో జిల్లా జైలులో 1500 మంది ఖైదీలు ఉన్నారు. దాదాపు వంద మంది దాకా సాయుధులు జైలుపై దాడికి దిగారు. జైలు అధికారులపైనా, గార్డులపైనా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక గార్డు, ఆరుగురు ఖైదీలు మరణించారు. దాదాపు రెండు గంటల పాటూ కాల్పులు జరిగాయి. పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేశారు. ఇదే అదనుగా ఖైదీలు పరారయ్యారు. దాడి చేసిన వారిని ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు అధికారులు. జైలులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను విడిపించేందుకే దాడి జరిగినట్టు భావిస్తున్నారు.
Samayam Telugu rebels free more than 150 inmates in philippines jail raid
జైలుపై భారీ దాడి: ఖైదీలు పరార్


కాగా తప్పించుకున్న 150 ఖైదీలను పట్టుకోవడానికి పోలీసులు, ప్రత్యేక దళాలు కూంబింగ్ ప్రారంభించాయి. అడవులు, చెట్లు, పుట్లు వదలకుండా తిరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.