యాప్నగరం

వెయిటర్‌కి రూ. 2.3 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. దావా వేస్తామంటున్న రెస్టారెంట్

పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌ సిటీలో ఓ రెస్టారెంట్‌లో టిప్‌పై వివాదం ఏర్పడింది. ఓ కస్టమర్ వెయిటర్‌కు లక్షల్లో టిప్ ఇచ్చాడు. ఇదేంటని అడిగితే.. జీసస్ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ రెస్టారెంట్ ఆయనపై దావా వేసేందుకు సిద్ధమైంది. వెయిటర్‌కు టిప్ ఇవ్వడంతో అక్కడ దుమారాన్ని సృష్టించింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 Sep 2022, 7:11 pm

ప్రధానాంశాలు:

  • వివాదాస్పదమైన టిప్
  • జీసస్ కోసం ఇచ్చానన్న కస్టమర్
  • కస్టమర్‌పై రెస్టారెంట్ సీరియస్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Scranton Restaurant tip issue
హోటల్స్‌లో, రెస్టారెంట్‌లలో ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకు టిప్స్ ఇస్తుంటారు. కస్టమర్లు ఎవరి స్థోమతను బట్టి.. వారు ఇస్తుంటారు. టిప్ ఇవ్వాలనే నిబంధనలు ఏ దేశంలోనూ లేదు. కానీ అదొక ఆనవాయితీగా వస్తుంది. టిప్ ఇస్తే.. వెయిటర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రభంజనం తర్వాత రెస్టారెంట్‌లు, హోటళ్లు తిరిగి ఓపెన్ చేసిన తర్వాత వెయిటర్లకు కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బును అందజేసినట్టు అనేక కథనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అమెరికా వంటి దేశాల్లో కస్టమర్లు వెయిటర్లకు భారీ మొత్తంలో టిప్స్ ఇస్తుంటారు. అలాంటి టిప్ ఓ రెస్టారెంట్‌లో పెద్ద చిచ్చు పెట్టింది.
పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌ సిటీలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న అమ్మాయికి కస్టమర్ ఎరిక్ స్మిత్‌ 3,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 2.3 లక్షలు ఇచ్చారు. ఎరిక్ కేవలం $13.25కి ఫుడ్ ఆర్డర్ చేశారు. కానీ వెయిట్రెస్ కోసం అదనంగా 3 వేల డాలర్లు తన క్రెడిట్ కార్డ్‌పై చెల్లించారు. తను చేసిన పనికి వేల డాలర్లు ఇచ్చారని తెలుసుకున్నప్పుడు వెయిట్రెస్ మరియానా లాంబెర్ట్ పూర్తిగా ఆశ్చర్యపోయింది. తను చాలా అదృష్టవంతురాలు అనుకుంది.

అయితే ఎరిక్ ఇది సోషల్ మీడియా ఉద్యమంలో భాగమని పేర్కొంటూ బిల్లులో టిప్స్ ఫర్ జీసస్ అని రాశారు. ఇది కాస్తా వివాదాస్పదం అయింది. ఈ క్రమంలో రెస్టారెంట్ ప్రతినిధులు సోషల్ మీడియాలో ద్వారా స్మిత్‌ను కలుసుకున్నారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్మిత్ రెస్టారెంట్ అభ్యర్థనను పట్టించుకోలేదు. పైగా తనపై కేసు వేసుకోమని చెప్పడంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఆయనపై దావా వేయాలని రెస్టారెంట్ నిర్ణయించుకుంది. అభ్యంతరాలు ఉంటే.. కేసు పెట్టుకోమని ఆ కస్టమర్ కూడా చెప్పడంతో.. రెస్టారెంట్ ఓనర్ జాకబ్సన్ దావా వేసేందుకు సిద్ధపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.