యాప్నగరం

భారత్‌లో పాక్ హైకమిషనర్ రాక ఆలస్యం.. కారణం ఇదే!

తమ దౌత్యఅధికారులను వేధిస్తున్నారని భారత్, పాక్‌లు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

TNN 18 Mar 2018, 1:34 pm
తమ దౌత్యఅధికారులను వేధిస్తున్నారని భారత్, పాక్‌లు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం జరిగే డబ్ల్యూటీఓ మంత్రుల సమావేశాని హాజరుకారదని పాకిస్థాన్ నిర్ణయించింది. అలాగే ఇస్లామాబాద్‌లోని దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపై వేధింపుల గురించి పాక్‌ వాణిజ్య మంంత్రి భారత పర్యటన సందర్భంగా నిలదీయాలని భావిస్తుండగా, ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పాక్ నిర్ణయంపై భారత్ అధికారికంగా స్పందించకపోయినా, ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతోన్న ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల అంశాన్ని ఆ దేశం తప్పక పరిశీలించాల్సిన అవసరం ఉందని భారత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దౌత్యాధికారులను వేధించడం ఇదే తొలిసారి కాదని, గత 12 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతోందని పేర్కొంటున్నారు.
Samayam Telugu return of pakistan envoy to india may be delayed
భారత్‌లో పాక్ హైకమిషనర్ రాక ఆలస్యం.. కారణం ఇదే!


మరోవైపు భారత్‌లోని తన దౌత్యాధికారి సోహయిల్ మహ్మద్‌ను తిరిగి పంపడంలో పాకిస్థాన్ తాత్సారం చేస్తోందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఆయన తిరిగి ఇండియా వెళ్లడం కుదరదని పాక్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. మార్చి 23 న ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో జరిగే పాకిస్థాన్ దినోత్సవ వేడుకలకు మహ్మద్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆయన మాత్రం ఎప్పుడు తిరిగివస్తారో తెలియడం లేదు . ఇలా పాక్ హైకమిషనర్ లేకుండా ఈ వేడుకలు జరగడం ఇదే తొలిసారి. మహ్మద్ రాక గురించి సమాచారం లేదని, పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత 2001-2002లో భారత్ పాక్ మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ప్రతిష్టంభనను పునరావృతం కానుందని భారత అధికారులు అంటున్నారు.

అయితే పాక్‌లోని భారత్ హైకమిషనర్ అజయ్ బిసారియాను వెనక్క రప్పించే ప్రయత్నాలను కేంద్రం చేయడంలేదని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు స్వల్పకాలిక వ్యూహాత్మక లాభాల కోసం తమపై కక్షసాధింపు చర్యలకు భారత్ పాల్పడుతోందని పాక్ ఆరోపిస్తుంది. ఇరు దేశాలకు చెందిన మహిళలు, వయోవృద్ధులై ఖైదీలను అప్పగింతపై భారత్, పాక్‌లు మధ్య మార్చి 7 న ఒప్పందం కుదిరిన తర్వాత పాక్ దౌత్యాధికారులు ఒక్కొక్కరుగా మన దేశం విడిచిపెట్టిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.