యాప్నగరం

హైఅలర్ట్.. బ్రిటన్ పార్లమెంట్ ముందు కాల్పులు

బ్రిడ్జ్ వద్ద నలుగురు తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో కనిపించారని.. మరికొంతమంది రక్తమోడుతూ ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడిన

TNN 22 Mar 2017, 9:32 pm
బ్రిటన్‌ పార్లమెంట్ ముందు బుధవారం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. తుపాకితో వచ్చిన దుండగుడు సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జ్ వద్ద జనంపై కాల్పులు జరిపాడు. సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులకు తెగబడుతున్న దుండగుడ్ని హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. దాదాపు 10 మంది గాయపడినట్లు సమాచారం. కాల్పుల సమాచారం అందుకున్న స్పీకర్ సభలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. భద్రతా సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.
Samayam Telugu shooting reported near britains house of commons in london
హైఅలర్ట్.. బ్రిటన్ పార్లమెంట్ ముందు కాల్పులు


బ్రిడ్జ్ వద్ద నలుగురు తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో కనిపించారని.. మరికొంతమంది రక్తమోడుతూ ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పార్లమెంట్‌‌లోని వైద్య సిబ్బంది అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడింది ఇద్దరంటూ పార్లమెంట్ క్లర్క్ చెప్తున్నా.. అధికారికంగా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు దాదాపు 12మంది పైగా గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్‌లు అక్కడ నుంచే ఫోన్‌లో.. ఆఫీస్ బయటికి రావద్దంటూ సహచరులకి చెప్తున్నారట. దుండగుడికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్న అధికారులు.. ప్రస్తుతం లండన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.