యాప్నగరం

అంతర్జాతీయ శాంతి దినోత్సవం: ప్రపంచ శాంతి సుదూర స్వప్నమేనా?

ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నాం.

Samayam Telugu 21 Sep 2018, 8:34 am
ఏటా సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఘర్షణలకు ముగింపు పలకడానికి, శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయడానికి శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ మూడో మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని 1981లో ఐరాస సాధారణ అసెంబ్లీ తొలి సమావేశంలో నిర్ణయించారు. 1982 సెప్టెంబర్ నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘ది రైట్ టూ పీస్’ అనే థీమ్‌తో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకొంటున్నాం.
Samayam Telugu peace day


2001 నాటి తీర్మానానికి అనుగుణంగా.. సెప్టెంబర్ 21న అంతర్జాతీయంగా అహింస, కాల్పుల విరమణ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రజల మధ్య శాంతి, గౌరవం పెంపొందించే ఉద్దేశంతో శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన వంతు కృషి చేస్తోంది. సెప్టెంబర్ 21న సభ్య దేశాలకు శాంతి, కాల్పుల విమరణ గురించి ఐరాస అవగాహన కల్పిస్తోంది.

దురాక్రమణలు, ఆధిపత్య పోరు, ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాలు రక్తమోడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి స్థాపన అనేది కలగా మారుతోంది. ఇకనైనా మనిషి మారాలని, మానవత్వంతో జీవించాలని కోరుకుందాం. యుద్ధ భయం లేని, అణ్వాయుధాల, క్షిపణుల బెడద లేని, రక్తపాతం లేని శాంతియుత ప్రపంచం దిశగా మనమంతా ముందడుగేద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.