యాప్నగరం

అధ్యక్ష భవనంలో దూరిన పాములు.. ఇంట్లో నుంచి పని చేసుకుంటున్న అధ్యక్షుడు

ఆఫీసులోకి పాములు ప్రవేశించడంతో లైబీరియా ప్రెసిడెంట్ జార్జ్ వీ ఐదు రోజులపాటు అధ్యక్ష కార్యాలయానికి దూరమయ్యారు. ఇంట్లో నుంచే ఆయన పనులను చక్కబెట్టుకుంటున్నారు.

Samayam Telugu 20 Apr 2019, 10:47 pm
ఆఫీసులోకి పాములు ప్రవేశించడంతో లైబీరియా ప్రెసిడెంట్ జార్జ్ వీ ఐదు రోజులపాటు ఇంట్లో నుంచి కార్యకలాపాలను నిర్వహించాల్సి వస్తోంది. బుధవారం రెండు నల్ల పాములు విదేశాంగ మంత్రిత్వ శాఖ భనవంలోకి ప్రవేశించాయని ప్రెస్ సెక్రటరీ స్మిత్ టోబే తెలిపారు. 2006లో అధ్యక్ష సౌధంలో మంటలు చెలరేగడంతో.. విదేశాంగ శాఖ భవంతిలోనే అధ్యక్షుడి అధికారిక కార్యాలపాలను కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ భవనంలోకి ప్రవేశించిన పాములను బయటకు రప్పించేందుకు పొగబెట్టడంతో.. అక్కడ పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అధ్యక్షుడు ఇంట్లో నుంచి తన పనులు చక్కబెట్టుకోగా.. విదేశాంగ శాఖ పాస్‌పోర్టుల జారీని ఏప్రిల్ 24 వరకు నిలిపేసింది. ఏప్రిల్ 22 వరకు ఆఫీసులకు దూరంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu snakes


ఈ భవనాలు పాతవి కావడంతో డ్రైనేజీ నుంచి పాములు బిల్డింగ్‌లోకి వచ్చేందుకు ఆస్కారం ఉందని టోబే చెప్పారు. పాములను గుర్తించినా గుర్తించకున్నా సోమవారం అధ్యక్షుడు తన కార్యాలయానికి వస్తారని ఆయన తెలిపారు.

ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన జార్జ్ వీ 1995లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అందించే ప్రతిష్టాత్మక బాలోన్ డీఆర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఆఫ్రికన్ ఆయనే కావడం గమనార్హం. 2018 జనవరిలో ఆయన లైబీరియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. లైబీరియా తొలి అధ్యక్షురాలైన ఎలెన్ జాన్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

1989 నుంచి 2003 వరకు లైబీరియా పౌర యుద్ధంతో అట్టుడుకుంది. 2014-16 మధ్య ప్రమాదకరమైన ఎబోలా వైరస్ బారిన పడింది. జార్జ్ వీ లైబీరియాలో పరిస్థితులను మెరుగుపర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.