యాప్నగరం

స్పెయిన్‌లో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. ఒక్క రోజే 950 మంది బలి

స్పెయిన్‌లో ఒక్క రోజులోనే 950 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ఒక్క రోజులోనే ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి కాగా.. ఆ దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య పది వేలు దాటింది.

Samayam Telugu 2 Apr 2020, 6:15 pm
స్పెయిన్‌లో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజులోనే తమ దేశంలో కోవిడ్ కారణంగా 950 మంది మరణించారని స్పెయిన్ ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో కోవిడ్ కారణంగా ఒక్కరోజులో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ యూరోపియన్ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటి 110,238కు చేరింది. గత కొద్ది రోజులుగా స్పెయిన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. స్పెయిన్‌లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 10,003 మంది ప్రాణాలు వదిలారు. కాగా ఇప్పటికీ ఆరు వేల మందికిపైగా ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu corona death
Image Source: Twitter


కరోనా వైరస్ కారణంగా పది వేలకు పైగా మరణాలు నమోదైన రెండో దేశం స్పెయిన్. ఇప్పటికే ఇటలీలో 110,574 మంది కోవిడ్ బారిన పడగా... 13,155 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల నుంచి ఇటలీలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది.

మరోవైపు అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ఐదు వేలు దాటింది. ఇక్కడ 2 లక్షల 15 వేల మందికిపైగా కోవిడ్ సోకగా.. 5110 మంది బలయ్యారు. ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 2 వేల మంది కరోనా వల్ల చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.